వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి ఫోన్ చేసిన నవాజ్ షరీఫ్: హామి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం సాయంత్రం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోన్ చేసి మాట్లాడారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసుకు పూర్తిగా సహకరిస్తామని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు.

పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చెయ్యడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ కేసు దర్యాప్తుకు ఎలా సహకరిస్తారు అనే విషయం వేచి చూడాలి.

Nawaz Sharif calls Prime Minister Narendra Modi

శనివారం వేకువ జామున పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో చొరబడిన ఉగ్రవాదులు సైనికుల మీద దాడికి దిగారు. సుమారు 80 గంటల పాటు భారత్ భద్రతా దళాలు, ఉగ్రవాదుల మద్య కాల్పులు జరిగాయి.

ఈ ఆపరేషన్ లో ఆరు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఏడుగురు సైనికులు బలి అయ్యారు. సుమారు 20 మంది భద్రతా సిబ్బందికి గాయాలైనాయి. పఠాన్ కోట్ ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య చర్చల పునరుద్ధరణపై సందిగ్ధం నెలకొంది.

English summary
Nawaz Sharif called Prime Minister Narendra Modi today evening and gave him the assurance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X