రెండు రాష్ట్రాల్లో 7గురు నక్సల్స్ అరెస్టు
బీహార్: బీహార్, చత్తీస్ గడ్ రాష్ట్రాల పోలీసులు మావోయిస్టులను అరెస్టు చేశారు. బుధవారం వేకువ జామున రెండు రాష్ట్రాలలో 7గురు మావోయిస్టులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వారిని విచారణ చేసి మిగిలిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.
బుధవారం వేకువ జామున బీహార్ లోని జమాయి ప్రాంతంలో పోలీసు కూబింగ్ నిర్వహించారు. ఆ సందర్బంలో నక్సల్స్ ఎదురుపడ్డారు. విషయం పసిగట్టిన పోలీసులు లోంగిపోవాలని హెచ్చరించారు. ఆ సందర్బంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
అయితే పోలీసులు చాకచక్యంగా దాడి చేసి భరత్ రావత్, దేవ నారాయణ యాదవ్, గోపాల్ రావత్, రవీంద్ర రావత్ అనే నలుగురిని ప్రాణాలతో పట్టుకుని అరెస్టు చేశారు. అదే విదంగా చత్తీస్ గడ్ ప్రాంతంలోని ఇంఫాలలోని అటవి ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలించారు.
ఆ సందర్బంలో మణిపురకు చెందిన కుకి నేషనల్ ఫ్రంట్ మావోయిస్టులు లంబోమాంగో కిప్లెన్ (25), జాన్ ఇంపుయ (41), మైప్ క్సాన్ (24) అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ముగ్గురిని విచారణ చేస్తున్నామని చత్తీస్ గడ్ పోలీసు అధికారులు తెలిపారు.