ఉగ్ర మూకలపై ఉక్కుపాదం : పాకిస్థాన్ కు ఇండియా వార్నింగ్
న్యూఢిల్లీ : సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని భారత్ స్పష్టంచేసింది. ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని మరోసారి తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి అంటూనే .. మరోవైపు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడింది. దీంతోపాటు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం ఏంటని ప్రశ్నించింది. ఓ వైపు శాంతి వచనాలు వల్లిస్తూ .. మరోవైపు హింసను ప్రోత్సహిస్తున్నారని హెచ్చరించింది.
పుల్వామా ఘటనతో మారిన పరిస్థితి
గత కొన్నేళ్లుగా జరుగుతోన్న ఉగ్రవాద చర్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. పుల్వామా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాడులు, ప్రతీ దాడులతో హోరెత్తింది. అవసరమైతే యుద్ధానికి వెనుకాడబోమని సంకేతాలు ఇవ్వడంతో పాకిస్థాన్ తోకముడించింది. కానీ సరిహద్దులో కాల్పులకు తెగబడటంతో భారత విదేశాంగ మరోసారి స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.

నయా పాకిస్థాన్ లో నయా యాక్షన్
పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద చర్యలను అరికట్టడం లేదు. నయా పాకిస్థాన్ అంటే ఇదేనా .. మీ నేలలో ఉగ్ర మూకలకు శిక్షణ ఇస్తారా ? మీ చర్యలు అలా ఉంటే వాటిని మేం కూకటివేళ్లతో పెకిలిస్తామన్నారు రవీశ్ కుమార్. ఇది మా నూతన చర్య .. సరిహద్దులో ఉగ్రవాదం పెట్రేగిపోతున్న తరుణంలో ఆయన ధీటుగా స్పందించారు.
-
Eid-ul-Fitr 2026 Ramzan: రంజాన్ ఎప్పుడంటే ? సౌదీ అరేబియా ప్రకటన..! భారత్ లో..! -
పాకిస్తాన్ అనాగరిక దాడి- తీవ్రంగా స్పందించిన భారత్..! -
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ యుద్ధానికి రంజాన్ సెలవులు..! -
పాకిస్తాన్ ఘాతుకంపై రషీద్ ఖాన్ షాక్ -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు?












Click it and Unblock the Notifications