ట్రాన్స్జెండర్తో మంత్రి రాసలీలలు.. వైరల్ వీడియో
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుపాను చెలరేగింది. ఎన్సీపీ కీలక నేత, ఎఫ్డీఏ మంత్రి నరహరి జిర్వాల్కు సంబంధించిన ఒక వివాదాస్పద వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తితో కలిసి పడకగదిలో ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఇబ్బందుల్లో ఉన్న జిర్వాల్కు, ఈ తాజా పరిణామం రాజకీయంగా పెను సవాలుగా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో జిర్వాల్, ఆయన పక్కన ఒక ట్రాన్స్జెండర్ అధికారిక గృహంలో ఏకాంతంగా గడుపుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై స్పందించిన రవి యాదవ్ అనే వ్యక్తి, సదరు ట్రాన్స్జెండర్ అనేకమంది ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని ఆరోపించారు.

ఎమ్మెల్సీ పదవి కోసమో లేదా ట్రాన్స్జెండర్ బోర్డులో కీలక బాధ్యతల కోసం ఆమె ఇలాంటి వీడియోలతో నాయకులను బెదిరిస్తోందని ఆయన ఒక టీవీ ఛానెల్తో పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో వెలుగులోకి రాగానే కాంగ్రెస్ పార్టీ, సామాజిక కార్యకర్త అంజలి దమానియా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహిస్తూ జిర్వాల్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
పార్టీలో అంతర్గత పోరు.. కుట్ర కోణం!
మరోవైపు, ఎన్సీపీ నేత అమోల్ మిట్కరీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది జిర్వాల్పై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆయన అభివర్ణించారు. "ఎనిమిది నెలల క్రితం నాటి పాత వీడియోను అసెంబ్లీ సమావేశాల ముగిసిన వెంటనే ఎందుకు విడుదల చేశారు? జ్యోతిష్యుడు అశోక్ ఖరత్ కేసులోని సిట్ దర్యాప్తు నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ డ్రామా ఆడుతున్నారు" అని మిట్కరీ మండిపడ్డారు.
అజిత్ పవార్ మరణానంతరం ఆయన భార్య సునేత్రా పవార్ అధ్యక్షురాలు కావాలని మొదటగా ప్రతిపాదించిన వ్యక్తి జిర్వాల్ అని, అందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుని వరుస వివాదాల్లోకి నెడుతున్నారని మిట్కరీ వాదించారు.
మహిళా నేతలపై కూడా వేటు గండం?
ఈ వివాదం కేవలం జిర్వాల్తోనే ఆగలేదు. ఎన్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపాలి చకన్కర్పై కూడా పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అశోక్ ఖరత్ కేసులో ఆమె పేరు వినిపించడంతో, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని నాసిక్, అహల్యానగర్ విభాగాలకు చెందిన మహిళా నేతలు సునేత్రా పవార్కు లేఖలు రాశారు. రూపాలి చకన్కర్ను తక్షణమే పదవి నుండి తొలగించాలని వారు కోరుతున్నారు.
సునేత్రా పవార్కు అగ్నిపరీక్ష..
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఎన్సీపీ పగ్గాలు చేపట్టిన సునేత్రా పవార్కు ఈ వ్యవహారం పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు జిర్వాల్పై వస్తున్న నైతిక మరియు అవినీతి ఆరోపణలు, మరోవైపు పార్టీ మహిళా విభాగంలో అసమ్మతి.. వీటిని ఆమె ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సక్పాల్ ఈ ప్రభుత్వాన్ని ఎప్స్టీన్ ఫైల్స్తో పోలుస్తూ తీవ్ర విమర్శలు గుప్పించడంతో, అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది.
-
100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్














Click it and Unblock the Notifications