వినూత్నం: ఎఫ్బి ప్రొఫైల్ బాగుంటే లోన్ ఇస్తామంటున్న 'క్యాష్ ఈ'!
లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించగలడా? అన్న విషయాన్ని కూడా ఫేస్ బుక్ ఆధారంగానే క్యాష్ ఈ నిర్దారించుకుంటుంది.
న్యూఢిల్లీ: మీ యథార్థ గాథకు వెయ్యికి పైగా లైక్స్ వస్తే రుణం ఇవ్వడానికి సిద్దమంటూ ఇటీవల టాటా క్యాపిటల్ వినూత్న రుణ మంజూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి మరో వినూత్న కార్యక్రమాన్ని క్యాష్ ఈ అనే స్టార్టప్ సంస్థ ప్రవేశపెట్టింది.
కేవలం ఫేస్ బుక్ ప్రొఫైల్ ఆధారంగా రుణ మంజూరు చేయడం దీని ప్రత్యేకత. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఫేస్ బుక్ ఖాతాను పరిశీలించి.. అన్ని విధాలుగా ఓకె అనుకున్న తర్వాత సదరు వ్యక్తికి రుణం మంజూరు చేయడం జరుగుతుందని క్యాష్ ఈ ప్రతినిధులు చెబుతున్నారు.

లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించగలడా? అన్న విషయాన్ని కూడా ఫేస్ బుక్ ఆధారంగానే క్యాష్ ఈ నిర్దారించుకుంటుంది. ఇప్పటికే ఈ సంస్థ రూ.50కోట్ల నిధులను సమీకరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా కార్యకలాపాల ద్వారా కస్టమర్ రుణ చరిత్రను ఈ సంస్థ పసిగడుతుంది. సోషల్ మీడియా వేదికలపై కస్టమర్ కదలికల డేటాను సేకరించి ఆ వివరాల ఆధారంగా రుణం మంజూరు చేస్తుంది.
లోన్ విషయంలో కస్టమర్ మొబైల్ డేటా, కాంటాక్ట్స్, యాప్స్ వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని క్యాష్ ఈ వ్యవస్థాపకులు వి.రమణకుమార్ తెలిపారు. రుణాన్ని మంజూరు చేసే పూర్తి స్థాయి యాప్ ఆధారిత కంపెనీ దేశంలో తమదేనని చెప్పారు. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటివి ఏమి ఉండవని, రుణం తీసుకునే వారి సంతకం కూడా తీసుకోమని, అంతా యాప్ ద్వారానే సాగుతుందని అన్నారు.
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్స్ లో 'క్యాష్ ఈ' యాప్ అందుబాటులో ఉంటుంది. కేవలం 5సులభ ప్రక్రియలతో యాప్ ద్వారా రుణం సొంతం చేసుకోవచ్చు. ఫేస్ బుక్, లింకెడ్ ఇన్ ఖాతాల ద్వారా దీనిలోకి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆపై యాప్ లో సూచించిన అర్హతలకు అనుగుణంగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ ఫర్ లేదా చెక్ ద్వారా తిరిగి రుణాన్ని చెల్లించవచ్చు. వన్ క్యాపిటల్ అనే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ద్వారా క్యాష్ ఈ రుణాలను మంజూరు చేస్తోంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications