మ్యాగీ నూడుల్స్ మటాష్: కుప్పలు పోశారు
బెంగళూరు: మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించడంతో మ్యాగీ పొట్లాలను తీసుకు వచ్చి ధ్వంసం చేస్తున్నారు. నిర్జనప్రదేశాలలోకి (ప్రయివేటు ప్రాంతం) మ్యాగీ నూడుల్స్ పొట్లాలను లారీలు, ట్రాక్టర్లతో పాటు 407 వాహనాలలతో తీసుకు వచ్చి ఒక చోట వేస్తున్నారు.
తరువాత బుల్డోజర్లతో వాటిని ధ్వంసం చేసి నిప్పంటించడానికి సిద్దం చేస్తున్నారు. వివిధ ప్రాంతాలలోని షాప్ లు, మాల్స్ లో ఉన్న మ్యాగీ స్టాక్ ను నెస్లె ఇండియా కంపెనీ ప్రతినిధులు వెనక్కి తీసుకుంటున్నారు. తరువాత వాటిని గౌడన్లకు తరలించారు.

మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను ధ్వంసం చేస్తామని నెస్లె ఇండియా కంపెనీ నిర్వహకులు గతంలో ప్రకటించారు.
చివరికి పలు వాహనాలలో వాటిని తీసుకు వచ్చి ధ్వంసం చేస్తున్నారు. చిన్న పిల్లలకు తినిపించే మ్యాగీ నూడుల్స్ లో ఎక్కవ శాతం సీసం ఉందని, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వెలుగు చూసింది.

తరువాత మ్యాగీ నూడుల్స్ ను నిషేధించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. జాతీయ ఆహార భద్రతా సంస్థ మ్యాగీ నూడుల్స్ నిషేధిస్తున్నామని ఆదేశాలు జారీ చేసింది. నెస్లె ఇండియా కంపెనీ నిర్వహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో రూ.320 కోట్ల విలువైన 27,420 టన్నులకు పైగా ఉన్న మ్యాగీ నూడుల్స్ ను ధ్వంసం చేస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications