ఆకలిపై వ్యాపారం అనుమతించం .. ఎంఎస్పీపై చట్టం చెయ్యండి : పీఎం మోడీ వ్యాఖ్యలపై రాకేశ్ టికాయత్
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది చట్టాలు అమలులోకి వస్తే కనీస మద్దతు ధరను పూర్తిగా ఎత్తివేస్తారని రైతుల ఆందోళన కొనసాగుతోంది . దీంతో మద్దతు ధర ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం చేసిన మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అనేది గతంలో ఉంది .. ఇప్పుడు ఉంది ఇకముందు కూడా కొనసాగుతుంది. అంటూ పేర్కొన్న మోడీ ఇప్పటికైనా రైతు నాయకులు మరోసారి చర్చలకు రావాలని ఆహ్వానిస్తున్నాము అని పేర్కొన్నారు. అయితే మోడీ వ్యాఖ్యలపై సంతృప్తి చెందని రైతు సంఘం నేతలు, మోడీ వ్యాఖ్యలపై తమ స్పందన తెలియజేశారు.
Recommended Video

ఎంఎస్పిపై చట్టం చేయాలని రైతుల డిమాండ్
కనీస మద్దతు ధర (ఎంఎస్పి) ఇక్కడే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినందుకు స్పందించిన రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ సోమవారం ఆకలిపై వ్యాపారం దేశంలో అనుమతించలేమని స్పష్టం చేశారు. కొత్త వివాదాస్పద వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను రద్దు చేయడంతో పాటు పంటల కోసం ఎంఎస్పిపై చట్టం చేయాలన్న రైతుల డిమాండ్ను ఆయన పునరుద్ఘాటించారు.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై మోషన్ ఆఫ్ థాంక్స్ కు ప్రతిస్పందనగా పిఎం మోడీ వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు పై విధంగా స్పందించారు.

విమాన టికెట్ రేట్లు రోజుకు పలుమార్లు పెరిగినట్టు పంటల ధర నిర్ణయం జరగదు
కనీస మద్దతు ధరపై ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించారు.
విమాన టికెట్ రేట్లు రోజుకు చాలాసార్లు హెచ్చుతగ్గులకు గురైనట్లుగా పంటల ధర నిర్ణయించబడదని రాకేష్ టికాయత్ నొక్కి చెప్పారు. విమాన టికెట్ యొక్క రేట్లు రోజుకు మూడు నుండి నాలుగు సార్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి, పంటల ధర అదే విధంగా నిర్ణయించబడదు అంటూ ఆయన చెప్పారు.నిరసనలలో నిమగ్నమై ఉన్న క్రొత్త సంఘం యొక్క ఆవిర్భావం గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యపై టికాయత్ , అవును, ఈసారి రైతుల సంఘం ఉద్భవించిందని , ప్రజలు కూడా రైతులకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.

ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తే దేశంలోని రైతులందరికీ ప్రయోజనం
కనీస మద్దతు ధర గత ముగిసిందని చెప్పామా? ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తే దేశంలోని రైతులందరికీ ప్రయోజనం కలుగుతుందని, ప్రస్తుతం కనీస మద్దతు ధర అమలుకు సంబంధించి దేశంలో ఎటువంటి చట్టాలు లేవని, అందుకే ట్రేడర్లు అన్న దాతలను దోచుకుంటున్నారని టికాయత్ పేర్కొన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే అక్టోబర్ 2వ తేదీ వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అప్పుడు రోడ్లనే దున్ని వ్యవసాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications