భారత్ లోకి డేంజర్ డ్రగ్.. ‘చైనా వైట్’.. మార్ఫిన్, హెరాయిన్ కన్నా వంద రెట్లు పవర్ ఫుల్!
చైనా నుంచి భారత్ కి మరో ప్రమాదం వచ్చిపడింది. మార్ఫిన్ లేదా హెరాయిన్ కన్నా వంద రెట్లు శక్తివంతమైన.. ప్రమాదకరమైన డ్రగ్ ‘చైనా వైట్’. ప్రస్తుతం ఈ డ్రగ్ మయన్మార్ మీదుగా భారత నార్కోటిక్స్ మార్కెట్ లోకి ప్రవ
Recommended Video
చైనా నుంచి భారత్ కి మరో ప్రమాదం వచ్చిపడింది. భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ తోపాటు చైనా కూడా ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో ప్రయత్నిస్తోంది.
మార్ఫిన్ లేదా హెరాయిన్ కన్నా వంద రెట్లు శక్తివంతమైన.. ప్రమాదకరమైన డ్రగ్ 'చైనా వైట్'. ప్రస్తుతం ఈ డ్రగ్ మయన్మార్ మీదుగా భారత నార్కోటిక్స్ మార్కెట్ లోకి ప్రవేశించింది.
‘చైనా వైట్’ మత్తులో ఢిల్లీ యువత?
దేశ రాజధాని ఢిల్లీలోని యువత చైనా నుంచి వస్తోన్న భయంకర డ్రగ్ ‘చైనా వైట్'కు అలవాటు పడినట్లు తెలుస్తోంది. డ్రగ్ స్మగ్లర్లు ఈ డ్రగ్ ను మయన్మార్ నుంచి మిజోరామ్, మణిపూర్ మీదుగా ఢిల్లీకి చేరవేస్తున్నట్లు సమాచారం. సబ్బు పెట్టెలు, బొమ్మలు, బూట్లు, కాస్మోటిక్స్ వస్తువుల ద్వారా ఈ చైనా వైట్ డ్రగ్ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విమాన మార్గాల్లో కూడా ఈ భయంకరమైన డ్రగ్ భారత్ లో ల్యాండ్ అవుతోంది.
భారత్ లోకి ప్రవేశంపై కేంద్రం ఆందోళన
మొన్నటి వరకు కెనడా, అమెరికాలకే పరిమితమైన ఈ ‘చైనా వైట్' ఇప్పుడు భారత మార్కెట్ లోకి ప్రవేశించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ డ్రగ్ అధిక డోస్ తీసుకున్న కారణంగా కెనడాలో రోజుకు ఇద్దరు చొప్పున మరణిస్తున్నారు.
మోతాదుకు మించి తీసుకుంటే.. మరణమే...
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్ గాయకుడు ప్రిన్స్ కూడా ఈ డ్రగ్ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అమెరికా వైద్యులు ధ్రువీకరించారు. ఒక్క 2016లోనే అమెరికాలో 20,100 మంది ఈ డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణించారు. గతంతో పోలిస్తే మృతుల సంఖ్య 540 రెట్లు పెరిగిందని అమెరికా పోలీసు అధికారులు చెబుతున్నారు.
అక్రమ సాగు, రవాణా...
మయన్మార్, లావోస్, థాయ్లాండ్ మధ్యనున్న గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. గంజాయిని అక్రమంగా పండిస్తున్న దేశాల్లో మయన్మార్ ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఒక్క 2006 నుంచి 2013 మధ్య కాలంలోనే ఆ దేశంలో గంజాయి సాగు రెండింతలు పెరిగింది.
గసగసాలకు వాటిని జోడించి...
హెరాయిన్ తరహాలోనే ఈ డ్రగ్ ను ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్ ద్వారా రక్తంలోకి ఎక్కించుకోవడం చేస్తుంటారు. చైనా వైట్ గా పిలిచే ఈ డ్రగ్ ను ఫెంటానిల్ అనే మొక్కల నుంచి తయారు చేస్తారు. గసగసాలకు ఫెంటానిల్ మొక్కల ఆకులను, కొద్ది మోతాదులో హెరాయిన్ను కలిపి ఈ చైనా వైట్ డ్రగ్ ను తయారు చేస్తున్నారు.
పట్టుకున్న పోలీసులు...
మయన్మార్ నుంచి భారీ ఎత్తున సరఫరా అయిన ఈ చైనా వైట్ డ్రగ్ ను బుధవారం మిజోరామ్ పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు ఢిల్లీలో మన పోలీసులు కూడా 12 కేజీల చైనా వైట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.50 కోట్లు ఉంటుందని అంచనా.