కనీసవేతనాన్ని పెంచిన ఆ ప్రభుత్వం... పనిమనుషులకు వర్తిస్తుందా..?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కనీస వేతనాల పెంపునకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త రేట్లను లేదా పెంచిన రేట్లను వెల్లడించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. అయితే కొత్త రేట్లకు సంబంధించి దీపావళికి ముందే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఇక ఢిల్లీలో పనిచేసే కార్మికుల కనీస వేతనం ప్రస్తుతం ఉన్నదానికంటే 11శాతం పెంచనున్నట్లు ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.

కొన్ని అంశాల ఆధారంగా కనీస వేతనం ఫిక్స్
కనీస వేతనం అనేది కార్మికులు చట్టపరంగా అదుకునే వేతనం. అయితే కనీస వేతనం నిర్ణయిస్తే ఇక అక్కడి నుంచి ఫలానా కార్మికుడు చేసే పని ఆధారంగా వేతనంను ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక కనీసవేతనంను ఫిక్స్ చేసే క్రమంలో ప్రభుత్వం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది. జీవనం సాగించేందుకు కుటుంబంలోని నలుగురు ఆహారంపై ఎంత ఖర్చు చేస్తున్నారు, బట్టలు, నివాసం, విద్యుత్, ఇందనం మరియు చదువు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని కనీస వేతనం ప్రభుత్వం ఫిక్స్ చేయనుంది.

2017లో కనీస వేతనం ఇలా ఉండేది
కనీస వేతనంను చాలా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ఫిక్స్ చేస్తున్నాయి. ఢిల్లీలో మార్చి 2017లో చివరిసారిగా కనీసవేతనంను ఫిక్స్ చేశారు. ఆ సమయంలో అన్స్కిల్డ్ లేబర్కు రూ. 13,350 ఉండగా... సెమీ స్కిల్డ్ లేబర్కు రూ. 14698, మరియు స్కిల్డ్ లేబర్కు రూ.16,182గా ఉన్నింది. అయితే ఈ కనీసవేతనాలు క్రమపద్ధతిలో ఇస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఏదో వేతనం ఇవ్వాలి కాబట్టి యజమానులు కార్మికుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులను బదిలీ చేసి ఆ తర్వాత తిరిగి తమ వద్ద నుంచి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పనిమనుషులకు వర్తిస్తాయా..?
ఇక కనీసవేతనాలు ఇంటిలో పనిచేసే పనిమనుషులకు వర్తించవని తెలుస్తోంది. ఎందుకంటే పనిమనుషులు చేసే పని అనధికారికంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. అంతేకాదు వారు ఇంతకాలం పాటు చేయాలని ఒప్పందం కూడా ఉండకపోవడంతో వారిని పరిగణలోకి తీసుకోరనే వాదన వినిపిస్తోంది. అయితే పనినుషులు కూడా గంటల తరబడి పనిచేస్తారని వారిని కూడా గుర్తించి కనీస వేతనం అమలయ్యేలా చూడాలనే డిమాండ్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications