ఐఏఎస్ డికే. రవి స్థానంలో మాన్వి నియామకం
బెంగళూరు: బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖ విభాగం జాయింట్ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి ఎస్.ఎ. మాన్విని నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ఎస్.ఎ. మాన్వి భాద్యతలు స్వీకరించి విధులలో నిమగ్నం అయ్యారు.
బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖ విభాగం జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి డి.కే. రవి గత నెల 16వ తేదిన అనుమానాస్పదస్థితిలో మరణించారు. అప్పటి నుండి ఆయన కుర్చి ఖాళీగా ఉంది. అత్యంత కీలకమైన ఈ పదవిలో ఎవరిని నియమించాలనే విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగానే ఆలోచించారు.

చివరికి ఐఏఎస్ అధికారి మాన్విని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మాన్వి పూర్తిగా ఇదే పదవిలో కొనసాగుతారా, లేక తాత్కాలికంగా ఆమెను నియమించారా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
కొంత కాలం మాన్వి పని తీరును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత సరైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారని తెలిసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications