News18-IPSOS exit poll: 243 సీట్లతో మహారాష్ట్రలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్, హర్యానా కమలమయం
ముంబై: మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసింది. ఆ తర్వాత వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చాయి. అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రెండు రాష్ట్రాల్లోను బీజేపీ కూటమిదే హవా అని, ఆ పార్టీ సునాయాసంగా అధికారం చేజిక్కించుకుంటుందని వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి, హర్యానాలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయి.

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన విజయ విహారం
మహారాష్ట్రలో బీజేపీ - శివసేన-మిత్రపక్షాల కూటమి 288 స్థానాలకు గాను ఏకంగా 243 సీట్లు గెలుచుకుంటుందని న్యూస్ 18 - ఐపోసిస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన ఈ పార్టీలు 186 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గతంలో కంటే అరవై వరకు సీట్లు ఎక్కువగా వస్తాయని న్యూస్ 18 - ఐపోసిస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఇప్పుడు కలిసి పోటీ చేసినా గతంలో కంటే సగానికిపైగా సీట్లు కోల్పోనున్నాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.

ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే?
బీజేపీ - శివసేన - మిత్రపక్షాల కూటమి 288 సీట్లకు గాను 243 సీట్లు గెలుచుకుంటుంది. బీజేపీకి 141 సీట్లు, శివసేనకు 102 సీట్లు వస్తాయని News18-IPSOS సర్వే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడించాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసి బీజేపీ 122 స్థానాలు, శివసేన 63 సీట్లలో గెలిచింది. ఇప్పుడు శివసేనకు 40కి పైగా సీట్లు, బీజేపీకి 20కి పైగా సీట్లు ఎక్కువ రానున్నాయి.

సగానికి పైగా పడిపోనున్న కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు
కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను కేవలం 41 స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ ఫోల్ పలితాలు వెల్లడించాయి. కాంగ్రెస్ 17, ఎన్సీపీ 22 చోట్ల గెలుచుకుంటుందని తెలిపాయి. 2014లో వేర్వేరుగా పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా 42, 41 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తంగా 90 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య 41కి పడిపోనుంది.

హర్యానాలో బీజేపీ మెగా క్లీన్ స్వీప్
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ ఒంటరిగా 75 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు పరిమితం అవుతుందని News18-IPSOS సర్వే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడించాయి. జేజేపీ 2 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించాయి.

ఇండియా టుడే యాక్సిస్ ఎగ్జిట్ పోల్
ఇండియా టుడే - యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వేలో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-మిత్రపక్షాల కూటమి 166-194 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ-మిత్రపక్షాల కూటమి 72-90 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది. ఇతరులు 22-34 సీట్లు గెలుచుకుంటారని తేలింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications