బెంగళూరులో పీజీల్లో ఉగ్రవాదులు మకాం ?, సోదాలు చేసిన ఎన్ఐఏ, విద్యార్థుల ముసుగులో!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని పీజీల్లో (పేయింగ్ గెస్ట్) ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాదులు విద్యార్థుల ముసుగులో బెంగళూరు పీజీల్లో మకాం వేశారని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది.
బెంగళూరు నగరంలోని సోలదేవనహళ్ళిలోని పీజీల్లో శుక్రవారం ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి అక్కడ బస చేసిన వారిని విచారణ చేసి వివరాలు సేకరించారు. బాంగ్లాదేశ్ కు చెందిన అన్సరుల్లా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు బెంగళూరు వచ్చారని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్ఐఏ అధికారులు మేఘాలయాలో ఫర్హాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బెంగళూరులోని పీజీల్లో ఇద్దరు బాంగ్లాదేశ్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని, వారు విద్యార్థుల ముసుగులో అక్కడ మకాం వేశారని ఫర్హాన్ సమాచారం ఇచ్చాడని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు.
గతంలో బెంగళూరు నగరంలో బాంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జమాత్ ఉల్ ముజాహుద్దీన్ (జేఎంబీ) ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంలో వారి కార్యకలాపాలు విస్తరించడానికి బెంగళూరు కేంద్రంగా చేసుకున్నారని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఇంతకు ముందు బెంగళూరు, రామనగరలో ఎన్ఐఏ అధికారులు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications