వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతాలివ్వలేను, వేరే జాబ్ చూసుకోండి: తన కంపెనీ ఉద్యోగులకు నీరవ్ మోడీ షాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో తన కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులకు తాను జీతాలు ఇవ్వలేనని, వేరే ఉద్యోగాలు చూసుకోవాలని నీరవ్ మోడీ సూచించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడి అతను దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

అతను భారత్‌లోని తన కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా లేఖలు పంపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాను జీతాలు చెల్లించలేనని, ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పాడు. దర్యాఫ్తు సంస్థలు తన కంపెనీల స్టాక్స్‌ను సీజ్ చేశాయని చెప్పాడు.

నా ఫ్యామిలీకి సంబంధంలేదు: నీరవ్, హైదరాబాద్ ఆస్తులపైనా తిరకాసు! అసలు ఉద్దేశ్యం ఇదీ!! నా ఫ్యామిలీకి సంబంధంలేదు: నీరవ్, హైదరాబాద్ ఆస్తులపైనా తిరకాసు! అసలు ఉద్దేశ్యం ఇదీ!!

బ్యాంకు ఖాతాలు పని చేయకుండా చేశారు

బ్యాంకు ఖాతాలు పని చేయకుండా చేశారు

ఆదాయ పన్ను శాఖ తన బ్యాంకు ఖాతాలను పని చేయకుండా చేసిందని నీరవ్ మోడీ చెప్పారు. దీంతో తాను ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితులో లేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తు గురించి కూడా స్పష్టత లేదని తేల్చి చెప్పారు.

Recommended Video

PNB Fraud : Nirav Modi, $ 1.6 Billion Fraud : CBI Alerts Interpol
ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతానో

ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతానో

ప్రస్తుత పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతానో తనకు తెలియదని ఆ మెయిల్‌లో నీరవ్ మోడీ పేర్కొన్నారు. వేరే ఉద్యోగాలు చూసుకోవడమే మంచిదని తన ఉద్యోగులకు సుచించారు.

తన పాస్‌పోర్టు రద్దుపై నీరవ్ లేఖ

తన పాస్‌పోర్టు రద్దుపై నీరవ్ లేఖ

తన పాస్‌పోర్టును రద్దు చేయడంపై నీరవ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్, సీబీఐ, విదేశాంగ శాఖలకు కూడా లేఖలు రాసినట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో నీరవ్‌తో పాటు ఆయన మామ ఛోక్సీపై కూడా సీబీఐ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన విషయం తెలిసిందే.

నీరవ్ మోడీపై కేసు నిలబడదు

నీరవ్ మోడీపై కేసు నిలబడదు

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు తాను రూ.11,300 కోట్లు బాకీలేనని నీరవ్ మోడీ చెప్పిన మరుసటి రోజు ఆయన కౌన్సెల్ విజయ్ అగర్వాల్ ఆసక్తికరర వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోడీ పైన కేసులు నిలబడవని అభిప్రాయపడ్డారు.

English summary
Nirav Modi, the man in the eye of the PNB fraud storm, has reportedly a penned a second letter, this time addressing his employees. In an email, Modi told his employees to look for other jobs as he will be unable to pay them their dues in light of the scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X