యోగాకు అనుకూలించే శరీరమా నీది?: షాకు నితీశ్
పాట్నా: యోగే చేసేందుకు సరిపోయే శరీరామా నీది అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుద్దేశించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యంగంగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ప్రతిరోజూ ఇంట్లో యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న పాట్నాలో జరిగే యోగా డే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని న్యూస్ పేపర్లో చదివి తెలుసుకున్న సీఎం నితీశ్ ఆయన్ని ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ యోగే చేసేందుకు సరిపోయే శరీరామా నీది? అంటూ వ్యంగంగా మాట్లాడారు. ప్రతిరోజూ యోగా ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యంగా ఉండాలని సూచించాడు. తద్వారా తన శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తాను ఎన్నో ఏళ్లుగా ఇంట్లోనే యోగా చేస్తున్నానని, కానీ ఏ రోజూ పబ్లిసిటీ కోసం చేయలేదని తెలిపారు.
బీజేపీ మాత్రం యోగాను ఒక పబ్లిక్ స్టంట్ లా చేస్తోందని విమర్శించారు. ఈ ఏడాది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో బీజేపీ ఈ యోగా డేని రాజకీయంగా వాడుకుంటుందని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.