ఇంతలో ఎంత మార్పు నితీశ్.. నాడు చెల్లని మోడీ.. నేడు అవసరమొచ్చింది.. చరిష్మాతోనే..
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అనే సామెత.. రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. బీహర్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి సామెత గుర్తుకొచ్చింది. 2010లో బీహర్ సీఎంగా నితీశ్ కుమార్ ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నారు. అయితే ఆ సమయంలో వారి మధ్య సఖ్యత లేదు. ప్రచారం చేసేందుకు మోడీ వస్తానని అంటే నితీశ్ రానీయలేదు. ఒకవేళ బీజేపీ మోడీ, వరుణ్ గాంధీని ప్రచారం కోసం పంపితే కూటమి నుంచి వైదొలుగుతానని నితీశ్ బెదిరించారు. కట్ చేస్తే 2020.. బీహర్ అసెంబ్లీ ఎన్నికలు.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అంతేకాదు బీహర్లో సుశీల్ కుమార్ మోడీ ఉన్నారు. మరో మోడీ ఎందుకు అని కామెంట్ చేశారు. నితీశ్ కామెంట్లతో అప్పటీ బీజేపీ నాయకత్వం తలొగ్గింది. కానీ ఇప్పుడు మాత్రం సిచుయేషన్ పూర్తిగా మారిపోయింది. మోడీ ప్రధాని కాగా.. ఆయన చరిష్మ కూడా పెరిగిపోయింది. అయితే గత 15 ఏళ్లుగా నితీశ్ కుమార్ అధికారంలో ఉన్నారు. కానీ ఈ సారి ఎందుకో విజయంపై ఆయన మాత్రం విశ్వాసంతో లేరు. తేజస్వీ యాదవ్ ప్రభ పెరగడం.. చిరాగ్ పాశ్వాన్ రాజకీయాలతో నితీశ్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. పదేళ్ల తర్వాత ప్రధాని మోడీపై ఆధారపడ్డారు. ఇటీవల రెండో విడత ప్రచారంలో ఎన్డీఏ, మోడీ అంటూ ప్రచారం చేశారు.

దీనిని బట్టి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పలేం. పదేళ్ల క్రితం వద్దు ఉన్న నితీశ్.. ఇప్పుడు మోడీ చరిష్మతో గెలువాలని అనుకొంటున్నారు. దీంతో సమయం ఎప్పుడూ ఓకేలా ఉండదు. అధికారమే పరామావధి అయిన రాజకీయాల్లో పూటకో తీరు ప్రవర్తిస్తున్నారు. కానీ ఓ సీఎం, పార్టీ అధినేత స్థాయిలో వ్యవహరించడం ఇక్కడ చర్చకు దారితీసింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications