జీన్స్ వేసుకొచ్చే అమ్మాయిలను ఏ అబ్బాయి పెళ్లి చేసుకోడు: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: కేంద్ర మానవాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీన్స్ వేసుకుని పెళ్లి మండపానికి వచ్చే అమ్మాయిని ఏ వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి సిద్దపడడు అని అన్నారు.
అలాగే ఎవరైనా సన్యాసి తన సాంప్రదాయ దుస్తులను వదిలేసి జీన్స్ వేసుకుంటే.. అతన్ని ఎవరూ గౌరవించరు అని పేర్కొన్నారు. గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో సత్యపాల్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతీయ సాంప్రదాయం, ఏ సందర్భంలో ఏ దుస్తులు వేసుకోవాలన్న విషయం గురించి చెబుతూ సత్యపాల్ డ్రెస్సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ నాథ్ దేవాలయంలో మహారానా ప్రతాప్ శిక్షా పరిషత్(ఎంపీఎస్పీ) ముగింపు కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.












Click it and Unblock the Notifications