మమతా బెనర్జీని కిమ్ జాంగ్ ఉన్తో పోల్చిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
కోల్కతా: బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో పోల్చారు. కిమ్ జాంగ్ ఉన్ మాదిరిగా తనకు అడ్డొచ్చిన వారిని మమతా చంపిస్తున్నారన్నారు.
దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రమే ప్రజాస్వామ్యం లేదని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్లా ప్రవర్తిస్తున్నారని, ఆమెకు ఎదురొచ్చిన వారిని చంపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సేవ్ డెమోక్రసీ పేరుతో రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన యాత్రను మమత ప్రభుత్వం వ్యతిరేకించారు. బీజేపీ ఈ యాత్ర చేపట్టాలనుకుంటున్న ప్రాంతాల్లో వర్గ పోరు చెలరేగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. యాత్ర నిర్వహించుకోవచ్చని ఏక సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఇదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్కతా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అక్కడ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బీజేపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
దీనిపై గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించుకోవచ్చునని, తమను ఎవ్వరూ ఆపలేరని, సుప్రీం కోర్టులో మేమే గెలుస్తామని చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications