బిపర్జాయ్ కల్లోలం: ప్రాణ నష్టం లేదు కానీ, వేలాది చెట్లు, వందలాది ఇళ్లు ధ్వంసం
గాంధీనగర్: బిపార్జోయ్ తుపాను గుజరాత్ రాష్ట్రంలో కల్లోలం సృష్టించింది. గురువారం రాత్రి ఈ తుపాను గుజరాత్ తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. భీకర గాలులు, భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి గుజరాత్లోని కచ్ ప్రాంతంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో దాదాపు వెయ్యి చెట్లు కూలిపోయాయి. 500కుపైగా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
భీకర ఈదురుగాలు, భారీ వర్షాల కారణంగా 1000 గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అయితే, ముందు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా ఈ పెను తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ కార్వాల్ తెలిపారు. తుపాను తీరం దాటిన కచ్ ప్రాంతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. తీరాన్ని తాకడానికి ముందే వారు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. అయితే, వివిధ ప్రాంతాల్లో 23 మందికి గాయాలైనట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు.

కచ్ జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని అతుల్ కార్వాల్ తెలిపారు. దాదాపు 40 శాతం గ్రామాల్లో స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అయితే, తీరం దాటే సమయానికి తుపాను సామర్థ్యం కాస్త తగ్గడంతో నష్టం కొంతమేర తగ్గిందన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధంగా ఉన్నాయిన తెలిపారు.
తీరం దాటిన బిపార్జోయ్ తుపాను ప్రస్తుతం దక్షిన రాజస్థాన్ మీదుగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, ముంబై, కర్ణాటక, రాజస్థాన్లోనూ తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అతుల్ వివరించారు.
16/06/2023#Cyclone"BIPARJOY"#Team 5 & 6NDRF
— 6 NDRF VADODARA (@6NDRFVADODARA) June 16, 2023
♦️Restoration work continues in urban and rural areas of #Porbandar #Kutch, #Jamnagar and #DevbhumiDwarka.
#Gujarat@NDRFHQ@collectorpor@CollectorKutch@COLLECTORDWK@CollectorJamngr@ndmaindia@ANI@PIBAhmedabad #NDRF4U pic.twitter.com/g5wDYQq6zn
కాగా, ప్రస్తుతం బిపోర్జాయ్ తుఫాను తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కారణంగా 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మేర్ జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications