రిపబ్లిక్ డే: ఈసారి పాక్ రేంజర్లకు స్వీట్లు లేవు, తేల్చేసిన బీఎస్ఎఫ్
Recommended Video
శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్ రేంజర్లతో రిపబ్లిక్ డే సందర్భంగా స్వీట్లు పంచుకునేందుకు భారత జవాన్లు ఇష్టపడలేదు. తాము ఇవ్వమని, మీరు ఇచ్చినా తీసుకోమని తేల్చి చెప్పారు.
ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ప్రధాన పండుగల సందర్భంగా పాక్ జవాన్లతో స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్ని నెలలుగా పాక్ పదేపదే కాల్పులు జరుపుతూ భారత జవాన్లను కవ్విస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం స్వీట్ల పంపిణీ ఉండబోదని గురువారమే పాక్ రేంజర్లకు స్పష్టంచేసినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. పంజాబ్లోని అమృత్సర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే అటారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ దగ్గర ప్రతిసారీ ఈ స్వీట్లు పంచుకుంటారు. కానీ, ఈసారి మాత్రం అక్కడ అలాంటి దృశ్యాలు కనిపించలేదు.