వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు భయం లేదు, గెలుస్తాం: అరవింద్ కేజ్రివాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను విశ్వాస తీర్మానం ఎదుర్కొనేందుకు ఎలాంటి భయాలకు లోనుకావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గురువారం శాసనసభలో విశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న సందర్భంగా కేజ్రివాల్ మీడియాతో మాట్లాడారు. శాసనసభలో విశ్వాస తీర్మానం నెగ్గినా, నెగ్గకపోయినా తమకు ప్రజల మద్దతు ఉందని ఆయన తెలిపారు.

తాము విశ్వాస తీర్మానం నెగ్గినా, ఓడిపోయినా తమకు ఏమాత్రం భయం లేదని, తాము అధికారం కోసం ఎదురు చూడటం లేదని అరవింద్ కేజ్రివాల్ తేల్చి చెప్పారు. తాము ఎన్ని రోజులపాటు అధికారంలో ఉంటామనేది కూడా తమకు ముఖ్యం కాదని తెలిపారు. ఒక వేళ విశ్వాస తీర్మానం పట్ల మాకు భయం ఉండి ఉంటే దేవలయానికి వెళ్లి ప్రార్థనలు చేసుకునే వారిమని కేజ్రివాల్ చెప్పారు.

Not afraid of trust vote, Arvind Kejriwal says

70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 28 శాసనసభ స్థానాలు గెలుచుకున్నఆమ్ ఆద్మీ పార్టీ గత ఆదివారం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసనసభ్యుల మద్దతును తీసుకుంది.

కాగా ఢిల్లీ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి మనీష్ సిసోడియా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు టోపీలు ధరించి సభలోకి రావడం పట్ల భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. బిజెపి ఎమ్మెల్యేల ఆందోళనల మధ్యే ఆప్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

swdew
xsdxwe
frg
English summary
Chief minister Arvind Kejriwal said his party was not afraid of facing a trust vote in the Delhi assembly on Thursday to determine whether or not his government enjoys majority support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X