కరోనా నుండి కోలుకున్న వారందరిలోనూ యాంటీ బాడీలు లేవు : సెరో సర్వేలో షాకింగ్ అంశాలు
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) జూలైలో నిర్వహించిన సెరో సర్వేలో గతంలో కోవిడ్ పాజిటివ్ను పరీక్షించిన 208 మందిలో 97 మంది రక్తంలో యాంటీ బాడీస్ గుర్తించలేదని, చాలా మందిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందటం లేదని పేర్కొంది. కోవిడ్ నుండి కోలుకున్న వారందరిలోనూ యాంటీ బాడీలు లేవని తేలింది . సెరో జరిపిన సర్వేలో కరోనాతో పోరాడే యాంటీ బాడీస్ స్వల్ప కాలంలోనే క్షీణిస్తున్నాయని, చాలా మందిలో అసలు యాంటీ బాడీస్ ఉండటం లేదని పేర్కొంది.
Recommended Video

ఢిల్లీలో కరోనా యాంటీ బాడీస్ టెస్టులపై నివేదిక
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఎన్సిడిసి తన సెరో-సర్వే నివేదికలో, నోయిడా, గుర్గావ్ , ఘజియా బాద్ వంటి నిరంతరం ఫ్లోటింగ్ ఉన్న ప్రదేశాలలో నిర్వహించే సర్వేలు కచ్చితంగా ఉండవని పేర్కొంటుంది. ఇప్పటివరకు కరోనా యాంటీ బాడీస్ పై టెస్ట్ నిర్వహించని అన్ని ప్రధాన ఎన్సిఆర్ నగరాలు మరియు పట్టణాల్లో సెరో-సర్వేలను కూడా ఇది సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో టెస్టులకు సంబంధించి జూలై 21 న తయారుచేసిన నివేదికపై జరుగుతున్న విచారణకు హైకోర్టుకు నివేదికను సమర్పించారు.

జులై లో 21,387 మందిపై నిర్వహించిన మొదటి రౌండ్ సర్వేలో 22.83% సెరో-పాజిటివిటీ రేటు
నివేదిక కాపీ కోసం ఆగస్టు 27 న ఎన్సిడిసికి లేఖ రాసిన ఢిల్లీ ప్రభుత్వం సోమవారం విచారణ సందర్భంగా నివేదిక పొందిందని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ నూతన్ ముండేజా కోర్టుకు తెలిపారు.నివేదిక యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో, గతంలో కోవిడ్ పాజిటివ్ను పరీక్షించిన వారిలో సెరో-పాజిటివిటీ లేదా యాంటీ బాడీస్ ఉనికిపై ఎన్సిడిసి చేసిన పరిశీలనలు ఉన్నాయి. జులై లో 21,387 మందిపై నిర్వహించిన మొదటి రౌండ్ సర్వేలో 22.83% సెరో-పాజిటివిటీ రేటు పెరిగింది.

కరోనా వైరస్ ను నియంత్రించే యాంటీ బాడీస్ చాలా అస్థిరమైనవి
సర్వే చేసిన వారిలో, 208 మంది గతంలో ఆర్టీ-పిసిఆర్ పద్ధతి ద్వారా పాజిటివ్ పరీక్షించారని చెప్పారు. 208 లో 111 మాత్రమే, అంటే 53.37%, సెరోపోజిటివ్ అని తేలింది మరియు ఆర్టీ పీసీఆర్ చేత పాజిటివ్ గా పరీక్షించబడిన 97 స్టడీ కేసులు సెరో నెగిటివ్ గా నిర్ధారణ అయింది . ప్రస్తుతం కరోనా పాజిటివ్ ను ఎదుర్కొనేందుకు ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ చాలా అస్తిరమైనవని , ఎప్పుడు క్షేనిస్తున్నాయో తెలీటం లేదని , దీనిపై మరింత లోతైన అధ్యయనం అవసరం అని ఎన్సిడిసి నివేదిక పేర్కొంది.

ఆగస్ట్ లో రెండో రౌండ్ సర్వే ... 15 వేల మందిపై అధ్యయనం .. 29% మందికి యాంటీబాడీస్
ఆగస్టులో ఢిల్లీలో రెండో రౌండ్ సెరో సర్వేను మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ నిర్వహించింది. 15,000 మందిని అధ్యయనం చేసిన తరువాత, 29% మందికి యాంటీబాడీస్ ఉన్నాయని కనుగొన్నారు. నగరంలోని రెండు కోట్ల జనాభాలో 60 లక్షల మంది వైరస్ ను నిరోధించే ఇమ్యూనిటీ అభివృద్ధి అయిందని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. అయితే, ఎన్సిడిసి తన నివేదికలో, కరోనా సంక్రమణ తర్వాత పొందినయాంటీ బాడీస్ ప్రాబల్యం మరియు సహజ రోగనిరోధక శక్తితో పరస్పర సంబంధం ఉందని అభిప్రాయపడింది .

చాలా మందిలో కోవిడ్ తర్వాత యాంటీ బాడీస్ లేవు
"సెరో-పాజిటివిటీ యొక్క వ్యవధికి మరియు యాంటీ బాడీస్ యొక్క సెరో-ప్రాబల్యం ద్వారా అందించబడే రక్షణ స్థాయికి సంబంధించి ఎటువంటి నిశ్చయాత్మక ఆధారాలు లేవని స్పష్టం అవుతుంది .ఢిల్లీకి పక్కనే ఉన్న యుపి మరియు హర్యానా జిల్లాల నుండి ఢిల్లీకి వలస జనాభా ఎక్కువగా ఉన్నందున, గణనీయమైన జనాభాలో యాంటీ బాడీస్ వృద్ధి చేసినప్పటికీ, ఇది స్వల్పకాలికమే కావచ్చు. ఇక కొందరిలో యాంటీ బాడీస్ వృద్ధి జరగటం లేదు. కేసుల పెరుగుదల యొక్క ముప్పు నిరంతరం ఉందని , అందువల్ల కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని ఇది తెలిపింది.

బీపీఎల్ కేటగిరీ లో ఎక్కువగా సెరో పాజిటివిటీ ... క్షుణ్ణంగా అధ్యయనం అవసరం
జూలై సెరో-సర్వేలో బిపిఎల్ కాని వర్గాలలో (20.45%) పోలిస్తే , బిపిఎల్ కేటగిరీ ప్రజలలో స్వల్పంగా సెరో-పాజిటివిటీ (24.40%) ఉంది. రద్దీ వాతావరణంలో నివసించే విషయాలలో (గదికి 3 మందికి పైగా) 23.5% మరియు 19.8% వద్ద ఉంది. రద్దీ లేని ప్రాంతాల్లో నివసించే వారి విషయంలో సెరో-పాజిటివిటీ ఎక్కువగా ఉన్నందున ఈ అధ్యయనం అధిక రద్దీతో సానుకూల సంబంధాన్ని వెల్లడించింది. ఏది ఏమైనా విభిన్న పరిస్థితులలో , విభిన్న వర్గాలలో యాంటీ బాడీస్ అభివృద్ధికి , యాంటీ బాడీస్ లేకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయని , అది క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాల్సి ఉందని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications