మాకు ఈరోజేం ముఖ్యమైనది కాదు: బీజేపీపై కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4గంటలకు సీఎం యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో జేడీఎస్ నేత, కాంగ్రెస్-జేడీఎస్ సీఎం అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తమకు అంత ముఖ్యమైన రోజేం కాదని అన్నారు.
తమకు ముఖ్యమైన రోజులు భవిష్యత్లో వస్తాయని కుమారస్వామి చెప్పారు. అంతేగాక, బలనిరూపణ పరీక్ష నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటల వరకు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంటుందని అన్నారు.

అయితే, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని కుమారస్వామి స్పష్టం చేశారు. ఏ ఒక్కరు కూడా వేరే పార్టీవైపు వెళ్లడం లేదని చెప్పారు. తాను, కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కలిసి ముందుకు సాగుతున్నామని కుమారస్వామి తెలిపారు.
బలనిరూపణలో యడ్యూరప్పకు ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. యడ్యూరప్ప సర్కారు బలనిరూపణ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ ఎలాంటి తప్పులు చేయడానికి ఆస్కారమే లేదని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటలకు యడ్యూరప్ప ప్రభుత్వం బల నిరూపణ పరీక్ష ఎదుర్కొనుంది. తమకు మద్దతుగా 120మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బీజేపీ చెబుతుండటం గమనార్హం. ఇది ఇలా ఉంటే, సాయంత్రం 5గంటల తర్వాత సంబరాలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం యడ్యూరప్ప.
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications