ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల ప్రధానాధికారి విఎస్ సంపత్ విడుదల చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఆయన శుక్రవారం ప్రకటించారు. 5 రాష్ట్రాల్లో లక్షా 30వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 11 కోట్ల మంది ఓటర్లున్నారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్లు ఎన్నికల ప్రధానాధికారి సంపత్ తెలిపారు.
230 స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్ శాసనసభకు నవంబర్ 25న, 40 స్థానాలు కలిగిన మిజోరాం శాసనసభకు డిసెంబర్ 4న, 70స్థానాలు కలిగిన ఢిల్లీ శాసనసభకు డిసెంబర్ 4న, 200స్థానాలు కలిగిన రాజస్థాన్ శాసనసభకు డిసెంబర్ 1న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 90 స్థానాలు కలిగిన ఛత్తీస్గఢ్ శాసనసభకు నవంబర్ 11, 19తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ డిసెంబర్ 8న జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఐదు రాష్ట్రాల్లోనూ వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 4న గుజరాత్, తమిళనాడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారాలతో ఈ ఐదు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. కాగా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి ఎవరూ లేకపోతే వారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ‘పై వారిలో ఎవరూ కాదు' అనే ఆప్షన్ను ఎంచుకోవచ్చు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications