చల్లారని కుల జాడ్యం: భార్య మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని స్మశానానికి భర్త
తన కూతురు వేరే కులం వ్యక్తితో వివాహం చేసుకుందని ఓ వ్యక్తిని బహిష్కరించారు గ్రామస్తులు.
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రాంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కూతురు వేరే కులం వ్యక్తితో వివాహం చేసుకుందని ఓ వ్యక్తిని బహిష్కరించారు గ్రామస్తులు. దీంతో చనిపోయిన భార్య అంత్యక్రియలకు ఎవరూ రాకపోవడంతో ఒక్కడే తన భుజాల మీద వేసుకుని స్మశాన వాటికకు వెళ్లాడు. ఒక్కడే ఆమెకు అంత్యక్రియలు చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని బోలంగిరి జిల్లాలోని తర్సుగూడ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మేఘూ భోయి అనే వ్యక్తి భార్య సజన(45) అనారోగ్యంతో మంగళవారం స్థానిక ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు తీసుకురావాలని మేఘాకు మందుల చీటీ ఇచ్చారు. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో బంధువులను సహాయం కోరాడు.

అతని కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంతో బంధువులు ఎవరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. కాగా, స్థానిక మందుల దుకాణాదారు కావాల్సిన మందులు ఇచ్చి సాయం చేశాడు. అయితే, మందులు తీసుకుని ఆస్పత్రికి చేరుకోవడం చాలా ఆలస్యమైంది. దీంతో చికిత్స పొందుతున్న సజన తుదిశ్వాస విడిచింది.
కాగా, సజన మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించేందుకు కూడా బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అతడే తన భుజాలపై మోసుకుని స్మశానవాటికికు చేరుకున్నాడు. ఐదు పెద్ద టైర్లు, ఆకులు వేసి ఆమె మృతదేహాన్ని దహనం చేశాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications