ప్రిన్సిపాల్ పోస్టు దక్కలేదని పార్శిల్ బాంబు: నవ వరుడు, నానమ్మ మృతి, వధువుకు తీవ్ర గాయాలు
భువనేశ్వర్: తనకు కాకుండా అదే కాలేజీలో పనిచేసే మహిళా లెక్చరర్కు ప్రిన్సిపాల్గా ప్రమోషన్ రావడంతో తట్టుకోలేక పార్శిల్ బాంబు పెట్టి ఇద్దరి మృతికి ఓ లెక్చరర్ కారణమయ్యాడు.ఈ ఘటనలో నవ వరుడు అతని నాయనమ్మ మృతి చెందారు. నవ వధువు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు మెహర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఒడిశా రాష్ట్రంలోని బొలన్గిరిలో సౌమ్య, రీమా సాహులకు వివాహం జరిగింది. వరుడు సౌమ్య తల్లి సంజుక్త స్థానికంగా ఉన్న బికాశ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది.
కుమారుడి వివాహనికి ముందుగానే లెక్చరర్ నుండి ఆమెకు ప్రిన్సిఫాల్గా ప్రమోషన్ దక్కింది. అయితే ఈ కాలేజీకి ప్రిన్సిఫాల్ కావాలని భావించిన ఆమె తోటి లెక్చరర్ ఆ కుటుంబంపై కక్షగట్టాడు.సంజుక్త కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ చేశారు. అయితే సంజుక్త తన కొడుకు వివాహనికి రావాలని మెహర్కు ఆహ్వనం పంపింది.
వివాహం జరిగి ఐదో రోజున మెహర్ నవ దంపతులకు గిఫ్ట్ను పార్శిల్లో పంపాడు. అయితే ఈ పార్శిల్లో బాంబు ఉందని తెలియని సౌమ్య , అతడి నానమ్మ ఈ పార్శిల్ను విప్పారు.
ఈ పార్శిల్లో ఓపెన్ చేయగానే బాంబు పేలిపోయింది. దీంతో నవ వరుడు సామ్య, అతడి నానమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరికి సమీపంలోనే ఉన్న నవ వధువు రీమాకు కూడ గాయాలయ్యాయి.
ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసుకు సంబంధించిన ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.