రేప్ బాధితురాలి ఆత్మహత్య: కాంగ్రెసు, బిజెపి ఒడిషా బంద్
భువనేశ్వర్: ఒడిశాలో బంద్ సందర్భంగా బుధవారం కాంగ్రెు కార్యకర్తలు భువనేశ్వర్లో రైల్వే ట్రాక్పై బైఠాయించి, రైళ్ల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోరాపుట్ జిల్లా కుందులిలో రేప్ బాధితురాలి ఆత్మహత్యకు నిరసనగా కాంగ్రెసు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో యూనిఫాం ధరించిన నలుగురు వ్యక్తులు తనపై మూడు నెలల క్రితం అత్యాచారం చేశారని 14 ఏళ్ల గిరిజన బాలిక ఆరోపించింది. అయితే, ఆమె సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

దాంతో కాంగ్రెసు, బిజెపి కోరాపుట్ జిల్లాలో బుధవారం బంద్ నిర్వహించాయి. బాలిక ఆత్మహత్య సంఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెసు, బిజెపి బిజూ జనతాదళ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
బాలిక మృతికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించార. తాను చేయాల్సిందంతా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications