Officer: జాయింట్ కమీషనర్ కు బ్యాక్ తడిసిపోయింది, పీఏని పంపించి ఏం చేశాడంటే? !
బెంగళూరు: లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ సామాన్య ప్రజల రక్తం తాగుతున్న అవినీతి అధికారులకు అసలు సినిమా చూపించడానికి రంగం సిద్దం అయ్యింది. ఇంతకాలం లక్షల రూపాయల లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ అవినీతి అధికారులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు లోకాయుక్త ఎంట్రీ ఇవ్వడంతో అవినీతి అధికారులకు మరోసారి చెమటలు పడుతున్నాయి. లోకాయుక్త అధికారులు సెకండ్ ఇన్సింగ్స్ పవర్ ఫుల్ అధికారి మీద పంజా విసరడంతో ఒక్కసారిగా లోకాయుక్త అధికారులు మరోసారి తెరమీదకు వచ్చారు. కర్ణాటకలో లోకాయుక్త అధికారుల పేరు చెబితో కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉచ్చపడేది. ఇప్పుడు సేమ్ సీన్ మరోసారి రిపీట్ అవుతోంది.
సిద్దరామయ్య దెబ్బతో ?
కర్ణాటకలో లోకాయుక్తకు ఉన్న పవర్ ఇంతా అంతకాదు. లోకాయుక్త అధికారుల దెబ్బతో ఇప్పటికీ మాజీ సీఎంలతో పాటు మాజీ మంత్రులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సిద్దరామయ్య సీఎం హోదాలో ఏసీబీని తెరమీదకు తీసుకు వచ్చి లోకాయుక్తకు ఉన్న అధికారులకు కత్తెరవేశారు.
హైకోర్టు ఆదేశాలతో షాక్
ఇటీవల కర్ణాటక హైకోర్టు ఏసీబీని రద్దు చేసి ఆ అధికారాలు మొత్తం లోకాయుక్తకు అప్పగిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఇంతకాలం ఏసీబీ చేతిలో ఉన్న అధికారాలు మొత్తం లోకాయుక్త చేతికి వచ్చాయి. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ సామాన్య ప్రజల రక్తం తాగుతున్న అవినీతి అధికారులకు అసలు సినిమా చూపించడానికి ఇప్పుడు లోకాయుక్త అధికారులు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఏసీబీ వలలో చిక్కకుండా ?
ఇంతకాలం లక్షల రూపాయల లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ అవినీతి అధికారులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు లోకాయుక్త ఎంట్రీ ఇవ్వడంతో అవినీతి అధికారులకు మరోసారి చెమటలుపడుతున్నాయి. లోకాయుక్త అధికారులు సెకండ్ ఇన్సింగ్స్ పవర్ ఫుల్ అధికారి మీద పంజా విసరడంతో ఒక్కసారిగా లోకాయుక్త అధికారులు మరోసారి తెరమీదకు వచ్చారు.
జాయింట్ కమీషనర్ కు షాక్
లోకాయుక్త అధికారులు బీబీఎంపీ (బెంగళూరు కార్పోరేషన్) జాయింట్ కమీషనర్ శ్రీనివాస్ పర్సనల్ సెక్రటరీ (పీఏ) ఉమేష్ రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం లోకాయుక్త పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు, బీబీఎంపీ జాయింట్ పోలీసు కమీసనర్ శ్రీనివాస్ కు లంచం ఇవ్వడానికి ఆయన పీఏ ఉమేష్ రూ. 4 లక్షలు తీసుకున్నాడని లోకాయుక్త అధికారుల విచారణలో వెలుగు చూసింది.
దెబ్బకు ఆఫీసర్ కు ఉచ్చపడింది
కర్ణాటకలో లోకాయుక్త అధికారుల పేరు చెబితో కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉచ్చపడేది. ఇప్పుడు సేమ్ సీన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఏసీబీని రద్దు చేసి లోకాయుక్తకు అన్ని అధికారాలు ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పడం, కర్ణాటక ప్రభుత్వం కూడా అందుకు సిద్దం కావడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.