గూడ్స్ రైలులో 12 పెట్రోల్ ట్యాంకర్లు లీకేజ్: ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు, అధికారులు!
Recommended Video

బెంగళూరు: వేగంగా వెలుతున్న గూడ్స్ రైలులోని ట్యాంకర్లలో ఉన్న పెట్రోల్ లీక్ కావడంతో రైల్వే సిబ్బంది, పోలీసులు హడలిపోయారు. ఏకంగా గూడ్స్ రైలులోని 12 ట్యాంకర్లలో పెట్రోల్ లీక్ కావడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది.
మంగళూరు నుంచి బెంగళూరు నగరంలోని యశవంతపురం రైల్లే స్టేషన్ కు గూడ్స్ రైలులో 15 ట్యాంకర్లలో పెట్రోల్ తీసుకువస్తున్నారు. మార్గం మధ్యలో మంగళవారం ఉదయం తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలోని యడియూరు రైల్వే స్టేషన్ దగ్గర పెట్రోల్ లీక్ అయిన విషయం రైల్వే సిబ్బంది గుర్తించారు.

మొత్తం 15 పెట్రోల్ ట్యాంకర్లతో మంగళూరు నుంచి బెంగళూరుకు గూడ్స్ రైలు బయలుదేరింది. అందులో ఏకంగా 12 ట్యాంకర్లలో పెట్రోల్ లీక్ కావడంతో రైల్వే సిబ్బంది, పోలీసులు హడలిపోయారు. స్థానికులతో పాటు రైల్వే ప్రయాణికులు గూడ్స్ రైలు దగ్గరకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
డీఎస్పీ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెట్రోల్ ట్యాంకర్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గూడ్స్ రైలులోని 12 ట్యాంకర్లలో ఒకే సారి పెట్రోల్ ఎలా లీక్ అయ్యింది అంటూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
-
నానాటికీ తగ్గుతున్న పెట్రోల్ `మార్జిన్లు` -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications