వాయువేగంతో వైరస్ వ్యాప్తి.. ఆ మూడు రాష్ట్రాల్లో పెరుగుదల రేటు ఎక్కువ.. ఎందుకంటే
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహర్ రాష్ట్రాల్లో అధికంగా ఉంటుంది. గత రెండువారాల్లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే పెరుగుదుల రేటు అర్థమవుతోంది. యూపీలో 2.14, జార్ఖండ్ 2.13, బీహర్ 2.09గా ఉంది.
యూపీలో ఒకరి ద్వారా ఇద్దరికీ వైరస్ వ్యాపిస్తోంది. జార్ఖండ్, బీహర్ కూడా ఇలానే ఉంది. అయితే మిగతా చోట్ల మాత్రం సగటు 1.32 శాతం ఉంది. ఒకరికే ఇక్కడ వైరస్ వ్యాపింపజేస్తున్నారు. కానీ ఆ మూడు రాష్ట్రాల్లో అలా కాదు. ఈ నెల మొదటి వారంలో యూపీలో రోజుకు 3 వేల చొప్పున కేసులు వస్తున్నాయి. అయితే అదీ మార్చిలో 105గా ఉండేది. జార్ఖండ్లో 870 కేసులు వచ్చాయి. బీహర్లో 732 కేసులు వచ్చాయి.
గతేడాది కూడా యూపీలో కరోనా కేసులు 2.16గా ఉన్నాయి. లాక్ డౌన్ విధించిన తర్వాత అదీ 1.25గా ఉంది. జూన్లో 1గా ఉంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రభావం ఏమీ లేదు. అయితే రోజువారీ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. యూపీ, జార్ఖండ్, బీహర్లో మాత్రం కేసులు యధేచ్చగా పెరుగుతున్నాయి.