జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన- లా కమిషన్ రోడ్ మ్యాప్-పార్లమెంటులో వెల్లడి
దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో క్లారిటీ ఇచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు న్యాయశాఖ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. దీంతో జమిలి ఎన్నికలు తప్పవన్న సంకేతాలు వెలువడ్డాయి.
దేశంలో తరచూ జరుగుతున్న ఎన్నికలు సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించి, నిత్యావసర సేవల పనితీరుపై ప్రభావం చూపుతున్నందున కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ఎన్నికలు నిర్వహించా ని పార్లమెంటరీ కమిటీ నివేదిక సూచించిందని కేంద్రం తెలిపింది. ఒకే ఎన్నికల వల్ల ప్రతి సంవత్సరం వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే భారీ వ్యయం కూడా తగ్గుతుందని నివేదిక పేర్కొంది. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్, భారత ఎన్నికల కమిషన్తో సహా వివిధ భాగస్వాములతో సంప్రదింపులు జరిపి లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించిందని కేంద్రం తెలిపింది. కమిటీ తన 79వ నివేదికలో దీనికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేసిందని వెల్లడించింది.

లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల కోసం ఆచరణీయమైన రోడ్మ్యాప్, ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి తదుపరి పరిశీలన కోసం లా కమిషన్కు సూచించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఇవాళ లోక్సభకు తెలిపింది.
కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు లా కమిషన్ ఆచరణాత్మక రోడ్ మ్యాప్ , ఫ్రేమ్వర్క్ను పరిశీలిస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం 2014 నుంచి ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్ని నిధులు విడుదల చేశారనే దానిపై కూడా వివరణ ఇచ్చింది.
దీని ప్రకారం వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఐదేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. దీంతో జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతున్నట్లు వివరించింది.












Click it and Unblock the Notifications