యుపి గ్యాంగ్ రేప్: ఇద్దరిలో ఓ కానిస్టేబుల్ అరెస్టు
బరేలీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఓ కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. గతవారం బాలికపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అవినాష్ యాదవ్ అనే కానిస్టేబుల్ను బదౌన్, బరేలీ సంయుక్త బృందం అదుపులోకి తీసుకుంది.
అవినాష్ యాదవ్ను పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బరేలీ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. ఢిల్లీకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో అతన్ని పట్టుకున్నారు. నిందితుడిని బదౌన్కు తీసుకుని వెళ్లారు. ఉదయం పది గంటలకు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
టాయిలెట్ కోసం ఇంటి బయటకు వచ్చిన అమ్మాయిని అవినాష్ యాదవ్తో పాటు అతని సహోద్యోగి వీర్ పాల్ సింగ్ యాదవ్ ఎత్తుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత బుధవారంనాడు వారిద్దరు ఆమెను పోలీసు స్టేషన్ సమీపంలోని క్వార్టర్స్కు తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు.
అర్థ సమయంలో అమ్మాయి ఇంటికి వచ్చిన జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అమ్మాయిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షలో తేలింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు ఆ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వారికి నేర చరిత్ర లేదు.