అక్కడికి విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసిన ఎయిరిండియా: సంచలన నిర్ణయం
జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు దాదాపుగా లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో 2,000 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది.

గాజా స్ట్రిప్లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 240 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. తమ దేశంలో ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున విధ్వంసానకి పాల్పడుతోందంటూ హమాస్ ఉగ్రవాదులు ఆరోపిస్తోన్నారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని హెచ్చరించారు.
దాడులు- ప్రతిదాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా స్ట్రిప్, పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో అట్టుడికిపోతున్నాయి. రాకెట్ల ప్రయోగాలు, వైమానిక దాడులతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాము యుద్ధం చేస్తోన్నామంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ప్రకటించారంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇజ్రాయెల్కు అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. టెల్ అవివ్, జెరూసలెం నగరాలకు విమానాలను నడిపించట్లేదని తెలిపింది. ఈ నెల 14వ తేదీ వరకు విమానాల రద్దు కొనసాగుతుందని పేర్కొంది.

ఈ మేరకు ఎయిరిండియా యాజమాన్యం ఓ ప్రకటన జారీ చేసింది. ఇజ్రాయెల్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 14వ తేదీ తరువాత- అప్పటి పరిస్థితులను సమీక్షించిన అనంతరం విమాన సర్వీసులను పునరుద్ధరించాలా? వద్దా? అనేది వెల్లడిస్తామని పేర్కొంది.
ఈ నెల 14వ తేదీ వరకు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేశామని ఎయిరిండియా తెలిపింది. వారికి అవసరమైన సపోర్ట్ను అందజేస్తామని, టెల్ అవివ్, ఇతర నగరాలకు టికెట్లను రీషెడ్యూల్ చేసే సమయం వివరిస్తామని పేర్కొంది. టెల్ అవివ్ నుంచి విమానాలు రావడం గానీ, అక్కడికి వెళ్లడం గానీ ఉండబోవని స్పష్టం చేసింది.
-
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications