Parliament : చర్చ లేకుండానే వ్యవసాయ చట్టాల ఆమోదం, రద్దు-ఇదేం చోద్యమంటున్న విపక్షాలు
పార్లమెంటులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసింది. వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి పార్లమెంటు ఉభయసభల్ని విపక్షాలు స్తంభింపజేశాయి. దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. అయినా కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవసాయ చట్టాల్ని రద్దును ఆమోదించేసింది.
దీనిపై విపక్షాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో వ్యవసాయ చట్టాల్ని పార్లమెంటులో చర్చ లేకుండానే ఆమోదించిన కేంద్రం.. ఇప్పుడు అవే చట్టాల్ని మళ్లీ చర్చ లేకుండానే రద్దు చేయడంపై మండిపడ్డాయి. ఇదేం ప్రజాస్వామ్యమంటూ కేంద్రాన్ని నిలదీశాయి. విపక్షాల అభ్యంతరాలు, నిరసనల మధ్య ఉభయసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన సభలు, అనంతరం నిరసనలు తగ్గకపోవడంతో చేసేది లేక మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మరోసారి సమావేశమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసిన విధానంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. చర్చ లేకుండా ఆమోదించారు, చర్చ లేకుండానే రద్దు చేశారు. ఇదేం ప్రజాస్వామ్యమంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలో ఇదో కొత్త మోడలా అంటూ ప్రశ్నించారు. పార్లమెంటులో కేంద్రం చర్యల్ని ఎండగడుతూ అబ్దుల్లా చేసిన ట్వీట్ వైరల్ అయింది.
Passed without discussion; repealed without discussion. A new model of democracy for a new India. #FarmLawsRepealed #FarmLaws
— Omar Abdullah (@OmarAbdullah) November 29, 2021
అనంతరం వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021పై చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాము. కానీ లోక్సభలో ఈ బిల్లును హడావుడిగా ఆమోదించడంతో, వారు (ప్రభుత్వం) తాము రైతులకు అనుకూలంగా ఉన్నామని నిరూపించాలని అనుకుంటున్నారంటూ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఎన్డీయే సర్కార్ ను మరో ట్వీట్ లో తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి మాట్లాడుతున్న ఫోటోను కూడా ఈ ట్వీట్ కు జతచేశారు.
We want that there should be a discussion on the Farm Laws Repeal Bill, 2021. But with the passing of this Bill in Lok Sabha in a haste, they (govt) just want to prove that they are in the favour of farmers: Leader of Opposition in Rajya Sabha, Mallikarjun Kharge pic.twitter.com/aCy4EHvRGY
— ANI (@ANI) November 29, 2021
వ్యవసాయ చట్టాల రద్దును చర్చ లేకుండా నేరుగా చేయడాన్ని తప్పుబడుతున్న విపక్షాలు రైతులకు కనీస మద్దతు ధర, పెగాసస్ నిఘాపై చర్చ, క్రిప్టో కరెన్సీ, వ్యక్తిగత డేటా గోప్యత చట్టం వంటి అంశాల్ని కూడా చర్చించాలని పట్టుబడుతూ సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. దీంతో ఇవాళ ఉభయసభలు రేపటికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications