బౌద్ధ మతం స్వీకరించిన 300మంది హిందువులు
పాట్నా: బౌద్ధుల పుణ్యక్షేత్రమైన బుద్ధగయలో సుమారు 300 మందికిపైగా వెనుకబడిన కులాలకు చెందిన హిందువులు బౌద్ధమతం స్వీకరించారు. కుల వివక్ష, అంటరానితనం వదిలించుకోవడం కోసమే తాము బౌద్ధమతంలో చేరినట్లు మతమార్పిడి చేసుకున్నవారు తెలపడం గమనార్హం.
బీహార్లోని ఔరంగాబాద్, జహనాబాద్ జిల్లాలతోపాటు, మహరాష్ట్రలోని నాగ్పూర్, సతారా నగరాలనుంచి, మధ్యప్రదేశ్ జబల్పూర్, రేవా నుంచి వచ్చిన వారంతా బౌద్ధంలో చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

మయన్మార్కు చెందిన బౌద్ధ సన్యాసి చంద్రముని, బుద్ధ గయలోని బర్మా విహార్ ఆశ్రమంలో జరిగిన దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కాగా, దీక్షా కార్యక్రమం బాబా సాహెబ్ అంబేద్కర్ మిషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ హిందువుల మతమార్పిడి కార్యక్రమంలో అంబేద్కర్ మిషన్ ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications