దడ పుట్టిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... మధ్యప్రదేశ్లో బయటపడ్డ 50 కేసులు... అప్రమత్తంగా ఉండాలన్న సీఎం...
ఓవైపు కరోనా బెంబేలెత్తిస్తోంటే... మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యుకోర్మైకోసిస్) ఇన్ఫెక్షన్ దడ పుట్టిస్తోంది. ఇటీవల గుజరాత్లో కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్లోనూ 50 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కోవిడ్ పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై బుధవారం(మే 12) సీఎం శివరాజ్ సింగ్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రోటోకాల్...
బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పట్ల వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. దాని లక్షణాలు,తీవ్రత,చికిత్స,నివారణపై దృష్టి సారించాలన్నారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినవారికి చికిత్స అందించే విషయంలో ప్రత్యేక ప్రోటోకాల్ పాటించనున్నట్లు తెలుస్తోంది.సీఎం సమీక్ష సమావేశం తర్వాత విడుదల చేసిన ప్రకటనలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం సమగ్ర ప్రోటోకాల్ను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ హైఅలర్ట్..
మధ్యప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వాస్ కైలాష్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం మేము హై అలర్ట్లో ఉన్నాం... భోపాల్లోని గాంధీ మెడికల్ కాలేజీ,జబల్పూర్లోని సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీలలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినవారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడి ప్రత్యేక వార్డులు 10 బెడ్ల చొప్పున సామర్థ్యాన్ని కలిగి వున్నాయి.' అని తెలిపారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్పై అధికారులు,వైద్యులతో మంత్రి విశ్వాస్ కైలాష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సమావేశంలో అమెరికా నుంచి అక్కడి వైద్య నిపుణులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన కీలక సమాచారాన్ని మధ్యప్రదేశ్ వైద్యులు,మంత్రికి వారు వెల్లడించారు.
Recommended Video

అదే కారణమా...?
మధ్యప్రదేశ్లోని భోపాల్,ఇండోర్,జబల్పూర్లలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడ్డాయి. కోవిడ్ చికిత్స సమయంలో పేషెంట్లకు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గుజరాత్లో 40 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇన్ఫెక్షన్ సోకినవారిలో కొందరు కంటిచూపు కూడా కోల్పోయారు. బ్లాక్ ఫంగస్కి చికిత్స ఉందని... అయితే చికిత్స ఆలస్యమైనా,చికిత్స తీసుకోకపోయినా ప్రాణానికే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో ర్మంపై మంట రావడం,చర్మం చిట్లిపోవడం,జ్వరం,దగ్గు,ఛాతి నొప్పి,శ్వాస సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications