గురుదాస్పూర్: పాక్ చొరబాటుదారుడ్ని హతమార్చిన బీఎస్ఎఫ్
పంజాబ్లోని గురుదాస్పూర్ సెక్టార్ వద్ద పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి భారత్లోకి చొరబడేందుకు యత్నించాడు. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా సిబ్బంది అతడిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.
అమృత్సర్: పంజాబ్లోని గురుదాస్పూర్ సెక్టార్ వద్ద పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి భారత్లోకి చొరబడేందుకు యత్నించాడు. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా సిబ్బంది అతడిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.
భారత్-పాక్ సరిహద్దు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటం భద్రతా సిబ్బంది గమనించారు. భద్రతా బలగాలు హెచ్చరించినప్పటికీ.. ఆ వ్యక్తి పట్టించుకోకుండా భారత భూభాగం వైపు చొరబడ్డాడు. దీంతో జవాన్లు అతడిపై కాల్పులు జరిపి హతమార్చారు.

ఉగ్ర చొరబాటు నేపథ్యంలో ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత జనవరిలో పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉగ్రవాదులు పంజాబ్లోని సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు.
More From
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications