ఇండియాపై విషం కక్కుతున్న పాకిస్థాన్ .. రెండు విమానాలు కూల్చివేశామంటూ ప్రకటన
ఇస్లామాబాద్ : దయాది పాకిస్థాన్ వైఖరి మాత్రం మారడం లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ .. నీతిమాలిన కథలు వల్లిస్తూనే ఉంది. పాకిస్థాన్ లో నక్కిన ఉగ్ర మూకల భరతం వాయిసేన పట్టడంతో .. తన కవ్వింపు చర్యలను మొదలుపెడుతూనే ఉంది. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోన్న పాకిస్థాన్ .. తాజాగా గగనతలంలో భారత్ జెట్ విమానాలపై దాడి చేశామని కహానీ చెబుతోంది.

రెండు జెట్ ప్లైట్లను కూల్చాం ?
ఐఏఎఫ్ దాడితో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న క్రమంలో .. తాము కూడా దాడులకు దిగుతున్నట్టు నటిస్తోంది. బుధవారం రెండు భారత జెట్ విమానాలను కూల్చివేశామని కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఆజాద్ జమ్ము కశ్మీర్ లో ఒకటి, కశ్మీర్ లో ఒక విమానం కూల్చివేశామని చెప్పిన కథనే వల్లేవేసింది. ఇందులో విశేషమేమిటంటే .. తాము ఒక పైలట్ ను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పింది.
తోసిపుచ్చిన భారత్
పాకిస్థాన్ నిరాధార ఆరోపణలు భారత్ తోసిపుచ్చింది. తమ జెట్ విమానాలను పాకిస్థాన్ కూల్చివేయలేదని స్పష్టంచేసింది. కశ్మీర్ లోని బుద్గాంలో ఒక జెట్ విమానం సాంకేతిక కారణాలతో కూలిపోయిందని తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరూ పైలట్లు చనిపోయారని మాత్రం పేర్కొన్నది. ఆజాద్ కశ్మీర్ లో జెట్ విమానాన్ని పాకిస్థాన్ కూల్చివేయలేదని .. విమానం కూలనప్పుడు ఇక ఫైలట్ ఎక్కడ ఉంటారి భారత్ ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications