సంచలనం: ర్యాలీలో మోడీ హత్యకు ప్లాన్.. రూ.50కోట్లకు పాక్ డీల్!?
మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాకు చెందిన సోనికి పాక్ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఈ డీల్ గురించి మాట్లాడాడు. ముందు చెప్పినట్లుగా.. రూ.50కోట్లు చాలకపోతే, మరింత డబ్బు ఇచ్చేందుకు సిద్దమన్నాడు.
పాకిస్తాన్: భారత ప్రధాని మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి పాకిస్తాన్ కుయుక్తులు పన్నడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా పాక్లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. మోడీని చంపేందుకు తమతో చేతులు కలపాలని, ఇందుకు గాను రూ.50కోట్లు ప్రతిఫలంగా ఇస్తామని పాక్ వ్యక్తులు మధ్యప్రదేశ్ కు చెందిన సోని అనే వ్యక్తికి ఫోన్ చేశారు.
తొలుత ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోని సోని.. ఆ తర్వాత దీని తీవ్రతను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాకు చెందిన సోనికి పాక్ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఈ డీల్ గురించి మాట్లాడాడు. ముందు చెప్పినట్లుగా.. రూ.50కోట్లు చాలకపోతే, మరింత డబ్బు ఇచ్చేందుకు సిద్దమన్నాడు.

'ముంబైలో జరిగే ఒక ర్యాలీలో మోడీని చంపడానికి' తమకు సహకరించాలని కోరాడు. మోడీని హత్య చేయడం కోసం.. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేశామని, మూడో వ్యక్తి కూడా అవసరమని చెప్పాడు. మూడో వ్యక్తి అవసరం వల్లే సోనికి ఫోన్ చేసినట్లు చెప్పాడు.
సోని ఫిరయాదు మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు.. దీనిపై సీరియస్ గా ఫోకస్ చేశారు. ఫోన్ నంబర్ ను 79651219గా వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇందులో నిజనిజాలను త్వరలోనే బయటపెడుతామని అన్నారు.












Click it and Unblock the Notifications