పాకిస్థాన్ జిందాబాద్: దెబ్బకు దెయ్యం దిగింది, పండగ చేసుకున్న దేశద్రోహి అరెస్టు !
ది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో పాక్ చేతిలో టీం ఇండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే.
బెంగళూరు: ది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో పాక్ చేతిలో టీం ఇండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపి ఎత్తుకుపోయిందని ఆనందంలో గంతులు వేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
దేశద్రోహం కింద కేసు నమోదు కేసి అతన్ని జైలుకు పంపించారు. కర్ణాటకలోని హావేరి జిల్లా, సవణూరు పట్టణంలో నివాసం ఉంటున్న షబ్బీర్ అహమ్మద్ బిజాపురి (35) అనే వ్యక్తి భారతదేశానికి విరుద్దంగా నినాదాలు చెయ్యడంతో అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

పాక్ చేతిలో టీం ఇండియా ఓటమి చెందిన తరువాత షబ్బీర్ అహమ్మద్ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడని, టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి పండగ చేసుకున్నాడని స్థానికులు సవణూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు షబ్బీర్ అహమ్మద్ మీద దోశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. షబ్బీర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని హావేరి జిల్లాలో ఆందోళనలు మొదలైనాయి. షబ్బీర్ అహమ్మద్ బిజాపురి జైల్లో చిప్పకూడు తినాలని, అప్పుడే బుద్ది వస్తోందని స్థానికులు అంటున్నారు.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications