కంటతడి పెట్టుకున్న పాకిస్థాన్ సైనికుడు..భారత్తో యుద్ధం చేయలేనని వెక్కి వెక్కి ఏడ్చాడు
భారత్తో యుద్ధం చేయలేమని కంటతడి పెట్టుకున్న పాకిస్థాన్ సైనికుడి వీడియో వైరల్గా మారడం నిజంగా హృదయాలను కదిలిస్తుంది. అతను తాను భారత్తో యుద్ధం చేయలేనని చెప్పడం వీడియోలో కనిపించింది. భారత్తో యుద్ధాన్ని నిరాకరించి కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను తమ ఆర్మీ జనరల్ అసిఫ్ మునీర్ , పాకిస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు.ఈ ఘటను చూస్తుంటే.. యుద్ధం యొక్క భయానకమైన ముఖాన్ని, దాని వల్ల కలిగే మానసిక క్షోభను ఈ వీడియో కళ్లకు కడుతోంది.
ఆ సైనికుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే, యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య జరిగే పోరాటం కాదని, అది వ్యక్తిగత జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుందో అర్థమవుతోంది. భారత్ , పాకిస్థాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వీడియో రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకునే వారికి ఈ వీడియో ఒక బలమైన సందేశాన్నిస్తుంది.

పాహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు మరణించడం, పలువురు గాయపడటంతో సైనికుల్లో భయాందోళనలు నెలకొన్నాయని సమాచారం. భారత్ ప్రతీకార చర్యకు దిగవచ్చనే భయంతో చాలా మంది సైనికులు తమ కుటుంబాల ఒత్తిడి మేరకు రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, సైన్యంలోని అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి కూడా రాజీనామాలకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. దాదాపు 4500 మంది ఆర్మీ సైనికులతో పాటు, 250 మంది ఆఫీసర్లు సైతం తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సైనికుల మనోధైర్యాన్ని పెంచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు ఆర్థిక సంక్షోభం కారణంగా సైనికుల్లో నెలకొన్న భయాందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మరోవైపు సైనికుల రాజీనామాలతో పాకిస్తాన్ ఆర్మీ సంక్షోభంలో కూరుకుపోయిందనే చెప్పవచ్చు. ఈ పరిణామాలు దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications