సంచలనం: తల్లిదండ్రులను దూషిస్తే పిల్లలను గెంటేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

సీనియర్ సిటిజన్లను ఇబ్బంది పెడుతూ నిత్యం దూషించే పిల్లలను నిర్ధాక్షిణ్యంగా ఇంటి నుండి తరిమివేయవచ్చని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: తల్లిదండ్రులను దూషించే పిల్లలను నిర్దాక్షిణ్యంగా ఇళ్ళ నుండి బయటకు పంపాలని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఇల్లు వారసత్వంగా వచ్చిందైనా, స్వంతంగా కొనుగోలు చేసిందైనా ఎలాంటి ఇబ్బందులు లేవని కోర్టు స్పష్టం చేసింది.

తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల జీవనం సంక్షేమ చట్టంలో అంశాల గురించి వ్యాఖ్యానించే సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తల్లిదండ్రులను శారీరకంగా హింసించేవాళ్ళు లేదా మానసికరంగా వేధించే కొడుకులు, కూతుళ్ళను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం సీనియర్ సిటిజన్లకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Parents can evict abusive sons and daughters from house: Delhi High Court

ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 325 కు సవరణలు చేయాలని డిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. కొడుకులకు పెళ్ళైనా అవ్వకపోయినా తల్లిదండ్రులు స్వంతంగా కష్టపడి సంపాదించుకొన్న ఇంట్లో ఉండేందుకు కొడుకులు కూతుళ్ళకు ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండదని జస్టిస్ మన్మోహన్ చెప్పారు.

తల్లిదండ్రులకు , పిల్లలకు మద్య సంబంధాలు బాగున్నంతవరకు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇంట్లో ఉండొచ్చని , అంతే తప్ప వాళ్ళకు భారంగా ఉండాలంటే మాత్రం కుదరదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+