వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: తల్లిదండ్రులను దూషిస్తే పిల్లలను గెంటేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

సీనియర్ సిటిజన్లను ఇబ్బంది పెడుతూ నిత్యం దూషించే పిల్లలను నిర్ధాక్షిణ్యంగా ఇంటి నుండి తరిమివేయవచ్చని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తల్లిదండ్రులను దూషించే పిల్లలను నిర్దాక్షిణ్యంగా ఇళ్ళ నుండి బయటకు పంపాలని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఇల్లు వారసత్వంగా వచ్చిందైనా, స్వంతంగా కొనుగోలు చేసిందైనా ఎలాంటి ఇబ్బందులు లేవని కోర్టు స్పష్టం చేసింది.

తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల జీవనం సంక్షేమ చట్టంలో అంశాల గురించి వ్యాఖ్యానించే సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తల్లిదండ్రులను శారీరకంగా హింసించేవాళ్ళు లేదా మానసికరంగా వేధించే కొడుకులు, కూతుళ్ళను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం సీనియర్ సిటిజన్లకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Parents can evict abusive sons and daughters from house: Delhi High Court

ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 325 కు సవరణలు చేయాలని డిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. కొడుకులకు పెళ్ళైనా అవ్వకపోయినా తల్లిదండ్రులు స్వంతంగా కష్టపడి సంపాదించుకొన్న ఇంట్లో ఉండేందుకు కొడుకులు కూతుళ్ళకు ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండదని జస్టిస్ మన్మోహన్ చెప్పారు.

తల్లిదండ్రులకు , పిల్లలకు మద్య సంబంధాలు బాగున్నంతవరకు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇంట్లో ఉండొచ్చని , అంతే తప్ప వాళ్ళకు భారంగా ఉండాలంటే మాత్రం కుదరదని చెప్పారు.

English summary
The HC underlined that the house need not be self-acquired or owned by parents.The court has cleared that as long as parents are in legal possession of the property, they can evict their abusive sons and daughters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X