12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన అఫ్జల్ గురు కుమారుడు
శ్రీనగర్: పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురు కుమారుడు గాలి గురు సెకండరీ స్కూల్ పరీక్షల్లో సత్తా చాటాడు. డిస్టింక్షన్లో అతను ఉత్తీర్ణుడయ్యాడు. పార్లమెంటుపై 2001లో జరిగిన దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే
అఫ్జల్ గురు కుమారుడికి 12వ తరగతి పరీక్షల్లో 88 శాతం మార్కులు వచ్చాయి. పరీక్షా ఫలితాలను గురువారంనాడు కాశ్మీర్ పాఠశాల విద్య బోర్డు అధికారులు వెల్లడించారు. నవంబర్లో జరిగిన పరీక్షలకు 55,163 మంది హాజరు కాగా 33,893 మంది ఉత్తీర్ణులయ్యారు.

మొత్తం 61.44 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 64.31 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58.92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
అఫ్జల్ గురు కుమారుడు గాలిబ్ గురుకు పదో తరగతిలో 95 శాతం మార్కులు సాధించాడు. ఐదు సబ్జెక్టుల్లో ఎ1 గ్రేడ్ వచ్చింది. బారాముల్ల జిల్లా సోపోర్లోని ఆయన గృహానికి మిత్రులు, కుటుంబ సభ్యులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా అతనికి శుభాకాంక్షలు అందుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికార ప్రతినిధి ట్విట్టర్లో అతనికి అభినందలు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications