Parliament mansoon session Day 12 : లోక్ సభలో వన్యప్రాణుల బిల్లు, రాజ్యసభలో ధరల చర్చ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు క్రమంగా గాడిన పడుతున్నాయి. ఆరంభంలో వారం రోజులకు పైగా విపక్షాల నిరసనలతో ఉభయసభల్లోనూ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఇవాళ మాత్రం విపక్షాలు కాస్త శాంతించడంతో ఇరు సభల్లోనూ రెండు కీలక అంశాలపై చర్చలు సాగాయి. వీటిలో లోక్ సభలో వన్యప్రాణి సంరక్షణ బిల్లుపై చర్చ సాగింది. అలాగే రాజ్యసభలో ద్రవ్యోల్బణంపై చర్చిస్తున్నారు.
వర్షాకాల సమావేశాల 12వ రోజు మధ్యాహ్నం సెషన్లో లోక్సభ వన్యప్రాణుల (రక్షణ) సవరణ బిల్లు 2021పై చర్చను చేపట్టింది. అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు క్రిమికీటకాలు, ఆక్రమణ జాతులు, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గించడాన్ని ప్రస్తావించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంపై జరిగిన చర్చలో ప్రస్తుతం వన్యప్రాణి సంరక్షణ చట్టంలో నరమాంస భక్షక జంతువులను చంపకూడదని అధికారులు ఎన్జీవోల ద్వారా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఎస్పీ ఎంపీ డాక్టర్ హసన్ చెప్పారు. ప్రజలు ఈ రోజుల్లో తమను తాము పాపులర్ గా మార్చుకోవడానికి స్వచ్చంద సంస్ధల్ని ప్రారంభించి, వన్యప్రాణుల ప్రేమికులుగా మారతారన్నారు.

మరోవైపు ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో చర్చ కొనసాగింది. ఆందోళనలను కేంద్రం తోసిపుచ్చగా, ఎడిబుల్ ఆయిల్, మందులు, పెట్రోలు ధరల పెంపుపై ప్రతిపక్షాలు హైలైట్ చేయడంతో ధరల పెరుగుదలపై రాజ్యసభ తన చర్చను కొనసాగించింది.రాజ్యసభలో జరిగిన ద్రవ్యోల్బణం చర్చలో ప్రభుత్వం ధరల పెరుగుదలను సమర్ధించుకుంది. విపక్షాలు మాత్రం ధరల్ని కేంద్రం అదుపు చేయడం లేదని ఆరోపించాయి. భారత్ లో ఎన్నో దేశాల కంటే ద్రవ్యోల్బణం మెరుగ్గానే ఉందని యూపీకి చెందిన బీజేపీ సుధాన్షు త్రివేదీ తెలిపారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి స్థిరమైన పతనంపై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భారత కరెన్సీ "పతనం కాలేదని రాజ్యసభలో తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాల తర్వాత కూడా, భారత కరెన్సీ "తనను తాను కాపాడుకుందని ఆర్థిక మంత్రి తెలిపారు. లోక్ సభలో డిఎంకె ఎంపి తాలికోట్టై బాలు ప్రభుత్వ రిజర్వేషన్లు, సామాజిక న్యాయ విధానాల సామర్థ్యాన్ని ప్రశ్నించారు.
ఇదే చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్రవ్యోల్బణాన్ని నాలుగు ప్లస్ లేదా మైనస్ 2% మధ్యస్థంగా కొనసాగించాలని, అయితే జూన్ నాటికి అది 7.01%గా ఉందని, ఇది మధ్యస్థం కంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఇది మిగిలిన సంవత్సరానికి 6% కంటే ఎక్కువగానే ఉంటుందని ఆర్బీఐ తెలిపిందన్నారు. ద్రవ్యోల్బణం అనేది చట్టం లేకుండా పన్ను విధించడమన్నారు. ద్రవ్యోల్బణం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 38ని ఉల్లంఘించడమేనని ఆయన చెప్పారు. ఇది "రాష్ట్రం, ప్రత్యేకించి, ఆదాయంలో అసమానతలను తగ్గించడానికి ప్రయత్నిస్తుందని, హోదాలో అసమానతలను తొలగించడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమైందని సాయిరెడ్డి ఆరోపించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెండు మార్గాలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆయన సూచించారు. ఇందులో నగదు నిల్వల నిష్పత్తి CRR 4.5% వద్ద ఉందని, దానిని మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సాయం చేస్తుందన్నారు. అలాగే ప్రస్తుతం 18% వద్ద ఉన్న చట్టబద్ధమైన లిక్విడిటీ నిష్పత్తిని ఆర్బీఐ అవసరమైతే 40% వరకు పెంచవచ్చన్నారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications