పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు తేదీలు ఖరారు
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రకటించింది.
అయితే ప్రతీ ఏడాది నవంబర్ మూడు లేదా చివరి వారంలో నిర్వహించే సమావేశాలను ఈ దఫా కాస్త ముందుస్తుగానే నిర్వహిస్తుండడం గమనార్హం. కాగా, నవంబర్ లేదా డిసెంబర్ ఆరంభమయ్యే నాటికే జీఎస్టీని అమలులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే శీతాకాల సమావేశాలను ముందుస్తుగా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నుంచి బడ్జెట్ సమావేశాలను కూడా జనవరిలోనే నిర్వహించాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది.













Click it and Unblock the Notifications