పాక్ డ్రోన్ల కలకలం: పఠాన్కోట్లో హైఅలర్ట్
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్లో మరోసారి హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్లు సంచరిస్తున్న నేపథ్యంలో అధికారులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఆ డ్రోన్లు చక్కర్లు కొడుతూ మన దేశ భూభాగంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నకిలీ కరెన్సీ, డ్రగ్స్ను జారవిడుస్తుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో దేశ భద్రతా దళాలు, పంజాబ్ రాష్ట్ర పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్-హిమాచల్ప్రదేశ్-పాకిస్థాన్ సరిహద్దును పంజాబ్ పోలీసులు జల్లెడపడుతున్నారు. పంజాబ్, పఠాన్కోట్లో మీదుగానే పాక్ డ్రోన్లు సరిహద్దును దాటి దేశంలోకి ప్రవేశించే అకాశం ఉండటంతో వాటిని తిప్పికొట్టేందుకు నిఘాను పటిష్టం చేశారు.

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ పోలీసులు హిమాచల్ప్రదేశ్ అటవీ ప్రాంతంలో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ సోదాలు పఠాన్ కోట్, నూర్పూర్ డీఎస్పీల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇల్లు, స్థావరాలను కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు.
అక్టోబర్ నెలలో పర్వదినాలు ఉండటంతో హైఅలర్ట్ ప్రకటించామని డీఎస్పీ రాజేందర్ మీడియాకు తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో దాడులు చేసే అవకాశం ఉండటంతో నిఘాను పటిష్టం చేశామని, సోదాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications