తప్పలేదు.. పేటీఎం 'యూటర్న్': ఆ నిబంధన ఎత్తేశారు..
వినియోగదారుల సౌలభ్యమే తమకు అత్యంత ముఖ్యమని, అందుకే క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఫీజు వసూలు రద్దు చేస్తున్నట్లుగా పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుతో పేటీఎం రీఛార్జీ చేసుకునేవారికి 2శాతం చార్జీలు తప్పవని ప్రకటించిన పేటీఎం.. ఆ నిర్ణయంపై యూ టర్న్ తీసుకుంది. లక్షలాది మంది ఖాతాదారుల ప్రయోజనాల రీత్యా 2శాతం ఛార్జీలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
వినియోగదారుల సౌలభ్యమే తమకు అత్యంత ముఖ్యమని, అందుకే క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఫీజు వసూలు రద్దు చేస్తున్నట్లుగా పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ ప్రకటించారు.పేటిఎం సేవల దుర్వినియోగంపై నిఘా మరింత పెంచుతున్నట్లు తెలిపారు.
పేటీఎం రీఛార్జీకి క్రెడిట్ కార్డు వాడుతున్నారా?: 2శాతం వడ్డింపు తప్పదు..
మరో వాలెట్ సంస్థ మొబిక్విక్ సైతం తమ వాలెట్స్లో క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేస్తే ఎటువంటి ఛార్జీలు వర్తించవని స్పష్టం చేసింది. కాగా, టెక్నాలజీ ఆధారంగా కొంతమంది యూజర్లు నగదు చెల్లింపులను రొటేషన్ కోసం వాడుకుంటున్నందున మార్చి 8నుంచి క్రెడిట్ కార్డు యూజర్లకు 2శాతం ఫీజు తప్పనిసరి అని పేటీఎం ఇటీవలే తమ బ్లాగులో ప్రకటించింది.