‘ది గ్రేట్ ఆపిల్ సేల్’షురూ.. భారీ ఆపర్లు ప్రకటించిన పేటీఎం
ఐఫోన్, మ్యాక్ బుక్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై పేటీఎం భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 16 వరకు ‘ది గ్రేట్ ఆపిల్ సేల్’ను పేటీఎం నిర్వహిస్తోంది.
ముంబై: డిజిటల్ లావాదేవీలలో బాగా పాపులర్ అయిన పేటీఎం.. ఐఫోన్, మ్యాక్ బుక్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి ఈ 'ది గ్రేట్ ఆపిల్ సేల్' ఫిబ్రవరి 16 వరకు కొనసాగనుంది.
పేటీఎం నిర్వహిస్తున్న ఈ సేల్ లో ఎంపిక చేసిన మ్యాక్ బుక్ ల కొనుగోలుపై రూ.20 వేల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. ప్రస్తుతం 15 అంగుళాల స్క్రీన్ డిస్ ప్లే కలిగినటువంటి ఆపిల్ మ్యాక్ బుక్ ధర రూ.1,50,000 వరకు ఉంది. దీనిపై వినియోగదారులకు రూ.20 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
అలాగే 256 జీబీ స్టోరేజి సామర్థ్యం కలిగిన ఐఫోన్ 7 కొనుగోలుదారులకు రూ.12 వేల క్యాష్ బ్యాక్ లభించనుంది. ఈ ఐఫోన్ పేటీఎంలో రూ.92 వేలుగా నమోదైంది. క్యాష్ బ్యాక్ మొత్తాన్ని ఉత్పత్తి అందించిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం ఖాతాలో క్రెడిట్ అవుతుందని పేటీఎం పేర్కొంది.
అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లో.. ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు. ఇక రూ.65 వేల ధర ఉన్న 128 జిబి స్టోరేజి సామర్థ్యం కలిగిన ఐఫోన్ 7 కొన్న వారికి రూ.7500 క్యాష్ బ్యాక్, రూ.46 వేలు ధరగా ఉన్న 32 జీబీ ఐఫోన్ 6 ఎస్ కొనుగోలు చేసిన వారికి రూ.6000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే 65 వేల ధర కలిగిన ఆపిల్ ఐప్యాడ్ ప్రో కొంటే.. రూ.9000 క్యాష్ బ్యాక్, ఆపిల్ వాచ్ కొన్నవారికి రూ.4500 వరకు క్యాష్ బ్యాక్ ను అందించనున్నట్లు పేటీఎం పేర్కొంది.