జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్కటైన బద్ధ శత్రువులు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేదానికి మరో నిదర్శనం జమ్మూ కశ్మీర్లో బద్ద శత్రువులుగా ఉన్న మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ, ఒమర్ అబ్దుల్లా పార్టీ ఎన్సీలు కాంగ్రెస్తో కలిసి కనిపించే అవకాశం ఉంది. బీజేపీ పీడీపీకి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇక అక్కడ కొన్ని నెలలుగా రాష్ట్రపతి పాలన నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పీడీపీ, ఎన్సీ పార్టీలు ఒక్కటై ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం పీడీపీ సీనియర్ నేత ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి అల్తాఫ్ బుఖారీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్కటవుతున్న పీడీపీ కాంగ్రెస్ ఎన్సీ పార్టీలు
జమ్ముకశ్మీర్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బద్ద శత్రువులంతా మిత్రులుగా మారి జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం రద్దయి కొన్ని నెలలు కావడంతో పాలనాపరంగా ఆ రాష్ట్రంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పీడీపీ సీనియర్ నేత బుఖారీ ఓ అడుగు ముందుకు వేసి అందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ కూటమికి ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా నేతృత్వం వహించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కోరుతున్నట్లు సమాచారం.

సీఎం అభ్యర్థిగా పీడీపీ సీనియర్ నేత అల్తాఫ్ బుఖారీ
ఒకవేళ కూటమి ఏర్పాటు అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పీడీపీ నేత అల్తాఫ్ బుఖారీ రేసులో ముందున్నారు. ఇదిలా ఉంటే ఎన్సీ మాత్రం కూటమిలో ఉండకుండా కాంగ్రెస్ పీడీపీలకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫరూఖ్ చెప్పారు. బుధవారం సాయంత్రం కల్లా చర్చలు జరిపి ఆ తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను కలుస్తారని సమాచారం. రాష్ట్రంలోని రెండు బద్ద శత్రువులు జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకహోదాను కాపాడటం కోసమే అని ఎన్సీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని రద్దు చేసేలా కేంద్రం గవర్నర్ను కోరే అవకాశం ఉందని తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు చెక్ పెట్టే ఛాన్స్ కూడా ఉందని మరో ఎన్సీ సీనియర్ నేత అన్నారు. ఏది జరిగినా తమకు సమ్మతమే అని కూడా చెప్పారు.

మూడు పార్టీలు కలిస్తే సంఖ్యా బలం 55 ..మ్యాజిక్ ఫిగర్ 44
ఇదిలా ఉంటే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)కి అసెంబ్లీలో 28 స్థానాలుండగా.. ఎన్సీకి 15 కాంగ్రెస్కు 12 స్థానాలున్నాయి.మూడు పార్టీలు కలిస్తే 55 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని అడ్డంకులు తొలుగుతాయి. మొత్తం 87 మంది సభ్యులున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 44. ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నానికల్లా అన్ని అడ్డంకులు తొలిగిపోయి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా కమలం పార్టీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిందని ఆజాద్ ఆరోపించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications