పెహ్లూఖాన్ డైరీ కోసం గోవులు తీసుకెళ్తున్నారు.. అక్రమ రవాణా కాదు..
కలకలం రేపిన పెహ్లూఖాన్ కేసులో రాజస్థాన్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పెహ్లూఖాన్, అతని కుమారులు ఇర్షాద్, ఆరిఫ్పై ఉన్న గోవుల అక్రమ తరలింపు అభియోగాలను కొట్టివేసింది. వారు గోవులను డైరీ కోసం తీసుకెళ్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో గోవుల అక్రమ రవాణా కింద నమోదైన ఎఫ్ఐఆర్ను కోర్టు కొట్టివేసింది.
2017లో హెహ్లూఖాన్, అతని కుమారులతో కలిసి హర్యానాలోని తమ స్వగ్రామం నుహ్ గ్రామానికి గోవులను తరలిస్తున్నారు. జైపూర్లోని మార్కెట్లో వారు గోవులను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఇంతలో కొందరు హిందుసంస్థలకు చెందినవారు అడ్డుకొని వారిపై దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ పెహ్లూఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. రెండురోజుల తర్వాత చనిపోయాడు. అతని కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వారు అక్రమంగా గోవులను తరలిస్తున్నారనే అభియోగంపై కేసు నమోదైంది.

ఈ కేసులో వాదోపవాదనలు జరుగుతున్నాయి. అయితే పెహ్లూఖాన్ గోవులను వధించడం కోసమే తీసుకెళ్తున్నారని అభియోగాలు నమోదు చేశారు. కానీ పెహ్లు ఖాన్ తరఫు న్యాయవాది కపిల్ గుప్తా మాత్రం గోవులను తరలించడం లేదని రాజస్థాన్ సింగిల్ బెంచ్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఆ గోవులు కేవలం రెండేళ్ల వయస్సు ఉన్నవని.. వాటిని తీసుకెళ్లి హతమార్చాబోరని వాదనలు వినపించారు.
అంతేకాదు రాజస్థాన్ బోవిన్ యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అయితే పోలీసులు మాత్రం ఒక రాష్ట్రం నుంచి మరొ రాష్ట్రానికి గోవులను తరలిస్తే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని కోరారు. కానీ పెహ్లూ ఖాన్ అలా పర్మిషన్ తీసుకోలేదని వివరించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గోవుల తరలింపు అభియోగాలను కొట్టివేస్తున్నట్టు మేజిస్ట్రేట్ తెలిపారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications