పెటాకి బక్రీద్ చేదు: శాకాహారం తినాలన్నందుకు దాడి
భోపాల్: పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా) కార్యకర్తలకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో... బక్రీద్ సందర్భంగా ముస్లింలు శాకాహారం స్వీకరించాలని, జంతువధ చేయరాదని పలువురు పెటా కార్యకర్తలు ప్రచారం చేశారు. ఆగ్రహించిన స్థానికులు వారిపై దాడి చేశారు.
ఉద్యమకారిణి బెనజీర్ సురయ్యా నేతృత్వంలో కొందరు వలంటీర్లు నగరంలోని తాజ్-ఉల్-మసీద్ వద్ద ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. సురయ్యా పచ్చని ఆకులను కలిగి ఉన్న చున్నీ ధరించి శాకాహారం ప్రాధాన్యతను చాటే ప్రయత్నం చేశారు. పెటా ప్రచారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్ళిపోవాలని ప్రతి నినాదాలు చేశారు.

అయినా సురయ్యా బృందం వెనక్కితగ్గకపోవడంతో వారు దాడికి దిగారు. అనంతరం, నగర పోలీస్ కమిషనర్ సునీల్ పాటిహార్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. సురయ్యాను సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనిపై స్థానికుడు నవీద్ ఖాన్ మాట్లాడుతూ... పెటా కార్యకర్తలు తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారని, తమ మతంపై నేరుగా దాడి చేసే యత్నం చేశారన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications